బోయినపల్లి వెంకట రామారావు [[కరీంనగర్ జిల్లాకుజిల్లా]]కు చెందిన ప్రముఖ సమరయోధుడు. ఇతను సెప్టెంబరు 2, 1920న తోటపల్లి గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. ఆర్యసమాజ్ ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడారు.<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 12 మాసాల కారాగారశిక్ష పొందారుపొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్గా పనిచేశారు.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలుగు యోధులు</ref> తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్నలలందుకున్న వెంకటరామారావు అక్టోబరు 27, 2014న మరణించారు.