గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
1952లోనే [[రంగస్థలం]] తో అనుబంధం ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడే '''మమత''' అనే నాటిక రాసి స్కూలు వార్షికోత్సవాలలో ప్రదర్శింపచేసారు. నెల్లూరులో నిర్వహించిన రాష్టస్థ్రాయి నాటక పోటీల్లో '''ఏది మార్గం''' అనే నాటిక రాసి ప్రదర్శింపచేసి, ఉత్తమ నిర్వహణ బహుమతి పొందారు.
 
== ఇతర రచనలు ==
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’అనే రంగస్థల నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకరంగంలో 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. '''గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా''' అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన '''[[వరవిక్రయం]]''', '''నిజం''', '''[[గయోపాఖ్యానం]]''' పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.
 
 
గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.
 
మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన వరవిక్రయం, నిజం, గయోపాఖ్యానంపైన విమర్శనాత్మక గ్రంథాలు కూడా వీరు రాసిన రంగస్థలంపైన తమకున్న పట్టు నిరూపించుకున్నారు.
అనేక ప్రతిష్టాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు అమెరికాలో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు ప్రచురించిన గ్రంథానికి సంగ్రహ సంపాదకులుగా వ్యవహరించి నాటక విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్నినాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. నాటక రంగానికి వీరుచేసిన అసమాన కృషికి ఎన్నో, ఎనె్నన్నో సత్కారాలు, సన్మానాలు, అవార్డులు వీరిని వరించాయి. వాటిలో కొన్ని: