జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
|||
పంక్తి 40:
==వ్యక్తిగత జీవితం==
[[మెదక్ జిల్లా]] [[ఆకారం]] గ్రామంలో [[1938]] [[ఏప్రిల్ 12]] న జన్మించిన ఆయన అసలు పేరు '''వీరవెల్లి రాఘవాచార్య'''. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాద్లోని మల్లేపల్లి, [[నిజాం కళాశాల]]లో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాద్లోని ఎల్.ఎన్.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు [[కరుణశ్రీ]] చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు [[చైనా]]కు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద [[నిఖిలేశ్వర్]], [[చెరబండరాజు]]లతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు.<ref>The Wages of Impunity By K. G. Kannabiran పేజీ.298 [http://books.google.com/books?id=V1eD4bGpqvMC&pg=PA298]</ref> 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై [[మఖ్దూం మొహియుద్దీన్]] ప్రభావం ఉంది. [[
==జ్వాలాముఖి రచనలు==
|