కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 12:
==సాహిత్యంలో==
కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''కిన్నెరసాని పాటలు'' అనే కవితా సంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో ''కోకిలమ్మ పెళ్లి''తో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కష్టదశలో కిన్నెరసాని వాగుకు ఆవల ఉన్న గ్రామంలో కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేశారు. ఆయనతో పాటుగా కుమారుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా వెంటవెళ్ళేవారు. ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగును దాటేప్పుడు కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూచినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో సంవదించింది. చుట్టూపులులూ పుట్రలూ ఏమీ పట్టలా, పాములు ప్రక్కగా పోయినాయి ఆయనకు పట్టలేదు. ఆ వాగు వలెనే తన భావప్రవాహం సాగిపోయింది. కులపాలికా ప్రణయపూతమైన తన హృదయంలో పడిన ఆ వాగు పవిత్రచారిత్రయైంది.<ref>{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు 1982|publisher=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|location=హైదరాబాద్|page=17|edition=మొదటి ప్రచురణ|accessdate=17 November 2014}}</ref>
కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు.
|