ఖడ్గ సృష్టి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
వీటిలోని అత్యధిక కవితావస్తువులు సాహిత్యాన్ని గురించే వున్నాయి. రాజకీయాల గురించి, సమకాలీన స్థితిగతుల గురించీ వున్నాయి. గాంధీ, నెహ్రూల మరణాల గురించిన ఎలిజీ వంటి కవితలు కూడా వున్నాయి.
== శైలి ==
ఖడ్గ సృష్టిలో అతివాస్తవికత అనే తెలుగు సాహిత్యానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు శ్రీశ్రీ. దానితో పాటుగా అధివాస్తవికమైన కవితలు కూడా ఇందులో వున్నాయి. సమకాలంలోని రాజకీయ సామాజిక సాహిత్య స్థితిగతులను అధిక్షేపిస్తూ కవితలు రాసి వాటికి ''కార్టూన్ కవిత్వమ''ని పేరుపెట్టారు. దీని గురించి విమర్శకుడు, శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు [[బూదరాజు రాధాకృష్ణ]] రాస్తూ ''ఇది శ్రీశ్రీకి కమ్యూనిజంలో ఉన్న నిబద్ధతకు అద్దంపడ్తుందేగాని, అక్కడక్కడ తప్ప మహాప్రస్థాన గీతాలతో పోలిస్తే దీని కవితాస్థాయి చాలా తక్కువ'' అన్నారు. దీనిలని శైలిగురించి భాష సులభీకృతమైంది, ఛందోధికారం పరాకాష్ఠకు చేరుకుంది, భావాలు బండగా వ్యక్తీకరించారని ఆయన పేర్కొన్నారు. వాటిని తరచుగా వామపక్ష రాజకీయ కార్యకర్తలు, విరసం కవులూ ఉదహరిస్తూండేవారు.
== ఉదాహరణలు ==
"https://te.wikipedia.org/wiki/ఖడ్గ_సృష్టి" నుండి వెలికితీశారు