వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
 
వేంకటాద్రి పాలనలో [[చెంచులు]] దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది.

ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. పిమ్మట బహుపశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పెరు మెదనె అచ్చమ్మపెట గా మారినది. వేంకటాద్రి నాయుడు [[1817]], [[ఆగష్టు 17]]న మరణించాడు.