తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
[[తిరువళ్ళూరు]], [[తమిళనాడు]] రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. [[తిరువళ్ళూరు జిల్లా]]కు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం [[ఆదిశేషుడు|ఆదిశేషుడిపై]] ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల సంచి ఆయన తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు ఇట్టే నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.
== చరిత్ర ==
1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]]గా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రికార్డ్ అయింది. ఏనుగుల వీరాస్వామయ్య ఆ గ్రంథంలో వ్రాస్తూ: తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని అనే తీర్థమున్నది. అందులో ప్రార్థనలవారు (భక్తులు) బెల్లము వేయిచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహాప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది పేట స్థలము. అన్ని వస్తువులు దొరకును అన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==ప్రయాణం ==
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు