విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
తననియోజక వర్గం లో విపరీతంగా ఉన్న మలేరియా ను అరికట్టేందుకు ఆమె ఎంతగానో, పాటుపడింది. విద్యార్థులు వ్యాయామ నిమిత్తం అనేక పట్టణ, పల్లెలలో ఆట స్థలాలెన్నో ఏర్పాటు చేసింది. ఎవరెన్ని చేయించినా, పేరుకు మాత్రం భారత ప్రభుత్వం కానీ, అధికారాలన్నీ గవర్నర్ల చేతుల్లో ఉండేవి. వారు వీరి ఆలోచనలూ, ఆశయాలూ సాగనివ్వకుండా నిరంకుశ విధానము లోనే నడిచేవారు.
 
==రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో==
1939 సెప్టెంబర్ లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభించబడింది. బ్రిటిషు ప్రభుత్వం ఈ యుద్ధంలో ఇండియాను ఇరికించింది. భారతీయుల సైనుకులు యుద్ధానికి రావాలంది. ప్రజానాయకులెవ్వరూ అందుకు అంగీకరించలేదు. బ్రిటిషు పాలకుల గోడమీది పిల్లి వాటం అటు నాయకులకూ అర్థం అయిపోయింది. నాయకులంతా రాజీనామా లిచ్చి బయటకు వచ్చేశారు.
 
భారతీయ నాయకులతో ఏ విధమైన సంప్రదింపులు లేకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగస్వామ్యులుగా చేసినందుకు విజయలక్ష్మీ పండిట్ ఆడ పులిలా గర్జించింది. భారతీయుల క్షేమం కోసం అంటూ, తన తప్పులతో భారతీయులకు పాలు పంచటం కుటిల రాజనీతి అంది. భారతీయులను బానిసలుగా చేసి వారి చేతిలో కీలుబొమ్మల మాదిరి ఆడించే బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని సహించమని హెచ్చరిక చేసింది. కేవలం యుద్ధ సమయాలలో మాత్రమే భారఈయులకు స్వాతంత్రము అనే ఎర వేస్తూ యుద్ధము ముగిశాక భారతీయుల పట్ల బ్రిటిష్ వారు చూపించే నిరాదరనను క్షమించరు భారతీయులంది. ఈ యుక్తుల ద్వారా బ్రితిషు ప్రభుత్వం సాధించి పెట్టేదేమిటో, నిక్కచ్చిగా తేల్చమంది.
 
లేవండీ ఈ దేశము మనది. పరిపాలించే వారు పరాయివారు. వారి అధికారాన్ని సహించకండి. జాతి మేలుకోవాలి. స్వరాజ్యం స్థాపించే వరకూ నిదురించకూడదు! ప్రజలను నిద్ర మోల్కొలపింది.
 
పక్షవాతం వచ్చి తల్లి స్వరూపారాణి మరణించింది. యుద్ధ సమయంలోనె గాంధీజీ 1940 లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించాడు. డెసెంబర్ 9 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ సత్యాగ్రహంలో చేరింది. అప్పుడు అరెస్టుచేసి ప్రభుత్వం ఆమెను నైనీ జైల్లో నాలుగు మాసాలుంచింది. దేశంలో ఈ రాజకీయ తుఫాను వతావరణంలో ఉండగానే జవహర్ లాల్ కుమార్తె ఇంధిరా గాంధీకి, ఫిరోజ్ ఖాన్ కు పెళ్ళి జరిగింది. ఆ సమయంలోనె క్రిప్సు రాయబారం చెడింది. 1942 ఆగష్టు తొమ్మిదవ తేదీన బాపూజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానము చేసింది. భారతీయనాయకులందరూ గాంధీజీకి అండగా నిలబడేసరికి నాయకులందరినీ ప్రభుత్వం ఖైదు చేసింది. 1942 ఆగష్టు 12 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ ను అరెష్టు చేశారు. చిన్నపిల్లలైన ఆమె కురార్తెలు భయమూ బాధా లేకపోగా తల్లికి ధైర్యం చెప్పి నైనీ జైలుకు పంపారు.
 
ఆమె
 
==జైలు జీవితంలో విజయలక్ష్మి==
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు