ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Reverted to revision 1327681 by Rajasekhar1961: why remove?. (TW) |
|||
పంక్తి 50:
'''ఇందిరా ప్రియదర్శిని గాంధీ''' ([[హిందీ]]: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) ([[నవంబర్ 19]], [[1917]] – [[అక్టోబర్ 31]], [[1984]]) [[భారత్|భారత దేశపు]] మొట్టమొదటి మరియు ఏకైక మహిళా [[ప్రధానమంత్రి]]. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదుర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.<ref>Gandhi, Indira. (1982) ''My Truth''</ref>.ఉన్నత రాజకీయ కుటుంబంలో [[సంయుక్త రాష్ట్రాలు]] (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు [[ఉత్తర ప్రదేశ్]])లోని [[మొఘల్ సరాయ్]] లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.
==ఇందిరాగాంధీ చరిత్ర==
భారతదేశ ప్రప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. 1917 -11-19న అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది.
తల్లి కమలామనెహ్రూ,తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. ఈమెకి ప్రియదర్శని అని నామాంతరం కలదు. బాల చరఖా సంఘాన్ని స్థాపించినది.
*1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
*1944-8-20న రాజీవ్ గాంధీ,1946-12-14న సంజయ్ గాంధీలకు జన్మనిచ్చింది.
*1955లో కాంగ్రెసులో చేరింది.
*1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
*1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది.
*1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
*1967-03-13న కాంగ్రెసుపార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది.
తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
*1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
*1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
*గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది.
*1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది.
*1971లోబంగ్లాదేశంని ఏర్పరిచినది.
*1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
*ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
*1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
*సిక్కిలను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది.
*1975-06-25న దేశంలో అత్యవసరపరిస్థితి విధించినది.
*1980-01-14న 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
*ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది.
*1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించినది.
*సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా.
బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు.
ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచినది.
*ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా,స్వంతయింటిలోనే మరణించెను.
ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు.
ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969,ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972,ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
*1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్,
*1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
*1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి.
*1967,1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు ,,మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా,,ఎన్నుకున్నారు.
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది.
అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో [[రాజభరణాల రద్దు]], [[గరీబీ హటావో]], [[20 సూత్రాల కార్యక్రమం]], [[హరిత విప్లవం]], [[బంగ్లాదేశ్ విమోచన]], [[1971]] [[పాకిస్తాన్]] తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ [[1975]] నాటి [[అత్యవసర పరిస్థితి]], [[స్వర్ణ దేవాలయం]] లో [[ఆపరేషన్ బ్లూస్టార్]] వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.
== బాల్యం ==
Line 72 ⟶ 111:
[[1984]]లో [[స్వర్ణదేవాలయం]]లో సైనికులను పంపి [[ఆపరేషన్ బ్లూస్టార్]] నిర్వహించి [[సిక్కు]] నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. [[1984]] [[అక్టోబర్ 31]]న ఆమె తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్సింగ్, బియాంత్సింగ్ లతోపాటు కుట్రదారుడు కేహార్సింగ్ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్ భాయ్'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్లాండ్లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు.(ఈనాడు 14.2.2010)
== సంతానం / వారసులు ==
ఇందిరా గాంధీకి ఇద్దరు కుమారులు - [[రాజీవ్ గాంధీ]] ([[1944]] - [[1991]]), [[సంజయ్ గాంధీ]] ([[1946]] - [[1980]]). సంజయ్ గాంధీని రాజకీయాలలో తెచ్చి, అత్యవసర పరిస్థితి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సంజయ్ ని తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలన్న సమయంలో [[విమానం|విమాన]] ప్రమాదంలో మరణించాడు[ఈ సమయ౦. ఆ తర్వాత [[1981]] ఫిబ్రవరిలో [[పైలట్]] ఉద్యోగాన్ని వదలి [[రాజీవ్ గాంధీ]] రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిర హత్య అనంతరం [[రాజీవ్ గాంధీ]] [[ప్రధానమంత్రి]] పదవిని చేపట్టి అత్యంత పిన్న వయస్సులో ఆ పదవిని చేపట్టిన రికార్డు సృష్టించాడు. అయితే [[బోఫోర్స్]] కేసులో ఇరుక్కొని ఎన్నికలలో ఓటమిపాలైనాడు. [[1991]] [[మే]]లో [[శ్రీపెరంబుదూర్]]లో ఎన్నికల ప్రచారం సమయంలో [[తమిళ ఈలం]] [[మానవ బాంబు]] దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.<br />
[[రాజీవ్ గాంధీ]] భార్య [[సోనియా గాంధీ]] పార్టీ ఆద్యక్ష పదవిలో ఉంటూ [[2004]] లోక్సభ ఎన్నికలలో యూ.పి.ఏ.కూటమి తో కల్సి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు [[రాహుల్ గాంధీ]], కుమారై [[ప్రియాంక]] లు కూడా రాజకీయాలలో ప్రవేశించారు.<br />
సంజయ్ గాంధీ భార్య [[మేనక గాంధీ]] సంజయ్ మరణం తర్వాత ఇంటి నుంచి గెంటివేయబడింది. వేరు కుంపటి పెట్టి [[సంజయ్ విచార్ మంచ్]] పార్టీ పెట్టిననూ మంచి ఆదరణ పొందలేదు. సంజయ్ గాంధీ కుమారుడు [[వరుణ్ గాంధీ]] ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] సభ్యుడు.
== బిరుదులు ==
|