కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →చరిత్ర |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
మొత్తమ్మీద, పైన చెప్పిన అభిప్రాయము గల పండితులు అందరూ, కాళిదాసుని సుంగ చక్రవర్తుల సమకాలీనునిగనూ,ముఖ్యముగా విక్రమాదిత్యుని కాలమైన క్రీ.పూ.100వ శతాబ్దికి చెందిన వానిగా పరిగణించుదురు.
=== చరిత్ర ===
కాళిదాసు క్రీ.పూ.1వ శతాబ్దిలో జన్మించాడు. మొదట్లో ఇతడు తన అందము మరియు అమాయకత్వము వలన గుర్తింపు పొందాడు. విక్రమాదిత్యుని ఆస్థానములో ప్రసిద్ధి నొందిన [[నవరత్నములు|నవరత్నములలో]] ఒకడిగా మన్ననలను పొందాడు. విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసినది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు మరియు తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. భార్యతో వివాహానికి పూర్వము జరిగిన విద్యా పాటవ ప్రదర్శనలో, విద్యోత్తమ తన మొదటి ప్రశ్నగా, '''అస్తి కశ్చిత్ వాగ్విశేషా:?'''(నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తి తో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) [[కుమారసంభవము]], కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) [[మేఘ సందేశం (సంస్కృతం)|మేఘసందేశం]] మరియు వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) [[రఘువంశము]].
కాళిదాసు జన్మస్థలము రకరకాలుగా చెప్పబడినది. అతడు తన కుమారసంభవము కావ్యములో హిమాలయములను వర్ణించిన తీరుని బట్టి కొందరు ఇతడు హిమాలయ పరిసర ప్రాంతవాసిగా అభిప్రాయపడ్డారు. కానీ, మేఘసందేశంలో ఉజ్జయిని నగరము తాలూకు వర్ణనలతో, ఇతడు ఉజ్జయిని నగరమునకు చెందిన వాడని మరికొందరి వాదన.
కాళిదాసు నేటి శ్రీలంకలో కుమారదాస చక్రవర్తి కాలములో హత్య గావింపబడినాడని ఓ వాదన. కానీ, కుమారదాసుడు క్రీ.శ.6వ శతాబ్దికి చెందిన వాడగుటవలన, ఆ వాదన వాదనగానే మిగిలిపోయింది.
===సంస్కృతకవిగా===▼
▲==సంస్కృతకవిగా==
ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింపఁ దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడఁబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానమునందలి కవులలో ఒకఁడై ఉండెను.
<poem>
Line 57 ⟶ 46:
ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.
==
కాళిదాసు రచనలలో మూడు నాటకాలు, మూడు కావ్యాలు ప్రసిద్ధము.
===
కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు [[మాళవికాగ్నిమిత్రము]] (మాళవిక మరియు అగ్నిమిత్రుని కథ), [[విక్రమోర్వశీయము]] (విక్రముడు మరియు ఊర్వశి కథ) మరియు [[అభిజ్ఞాన శాకుంతలము]] (శకుంతలను గుర్తించుట). అభిజ్ఞాన శాకుంతలము అత్యంత ప్రాచుర్యము పొందిన నాటకము. అంతేగాక, ఆంగ్లములో మరియు జర్మనులో అనువదింపబడిన మొదటి కాళిదాసు రచన ఇది.
;మాళవికాగ్నిమిత్రము
కాళిదాసు ప్రథమ కృతి అయిన [[మాళవికాగ్నిమిత్రము]] అగ్నిమిత్రుని యొక్క ప్రేమ గాథ. అగ్నిమిత్రుడు బహిష్కృతురాలయిన మాళవిక అను ఒక సేవిక యొక్క ఛాయాచిత్రమును చూసి ఆమెను ప్రేమించును. ఈ విషయము తెలిసిన రాణి, మాళవికను కారాగృహమున బంధించును. కానీ, విధి యొక్క లీలావిలాసము వల్ల చివరికి మాళవిక ఒక రాకుమార్తె అని తెలిసి వారిరువురి బంధానికి గల అడ్డంకులన్నీ తొలగిపోవును.
;అభిజ్ఞాన శాకుంతలము
[[అభిజ్ఞాన శాకుంతలము]] దుష్యంత మహారాజు గూర్చిన కథ. వేటకై వెళ్ళిన దుష్యంతునకు మహర్షి కణ్వునిచే పెంచబడిన శకుంతల కనపడుతుంది. ఆ కలయిక ప్రేమగా మారి శకుంతలను వివాహమాడేలా చేస్తుంది. అంతలోనే దుష్యంతుడు కొన్ని పరిస్థితులలో శకుంతలను అక్కడే విడచి రాజ్యానికి తిరిగి వెళ్ళవలసివస్తుంది. ఇక్కడ గర్భవతురాలయిన శకుంతల ఒక పొరపాటుతో ముని కోపానికి గురయి, దుష్యంతుడు గురుతుగా ఇచ్చిన ఉంగరమును అతడు మరల చూడనంతవరకు భర్తచే మరుపుకు గురయ్యే శాపము పొందుతుంది. పుత్రుడు జన్మించిన పిదప దుష్యంతుని కలుసుకొనుటకు చేయు ప్రయాణములో దుష్యంతుడిచ్చిన ఉంగరమును పోగొట్టుకొని, ముని శాప ప్రభావము వలన దుష్యంతునిచే గుర్తింపబడక తిరస్కారమునొందును. పోగొట్టుకోబడిన ఆ ఉంగరము ఒక జాలరికి దొరికి ఆతని ద్వారా దుష్యంతునికి చేరును. అది చూసినంతనే దుష్యంతునకు తాను శకుంతల పట్ల చేసిన తప్పిదము గుర్తుకు వచ్చి ఆమెను కనుగొని క్షమాపణలతో తిరిగి ఒకటవుదురు.
;విక్రమోర్వశీయము
=== కావ్యాలు ===
Line 75 ⟶ 60:
* [[మేఘ సందేశం (సంస్కృతం)|మేఘ సందేశము]]
* [[ఋతు సంహారము]]
=== ఇతరములు ===
=== వ్యాఖ్యానములు ===
== ఆధునిక సంస్కృతిలో కాళిదాసు ==
===ఇతిహాసము===
=== ఇవి కూడా చూడండి ===
* [[మహాకవి కాళిదాసు (సినిమా)]]
=== బయటి లింకులు ===▼
▲== బయటి లింకులు ==
* [http://en.wikipedia.org/wiki/Kalidasa కాళిదాస - వికీ ఆంగ్లము]
* [http://www.cs.colostate.edu/~malaiya/kalidas.html కాళిదాసు జీవితం మరియు రచనలు]
|