గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== కంపెనీ పాలనకు వ్యతిరేకంగా కుట్ర ==
[[గులాంరసూల్ ఖాన్]] పరిపాలన కాలంలో [[ఈస్టిండియా]] కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ సుల్తాను విజయం సాధిస్తారని, అలా బలహీనపడివున్న సమయంలోనే ఉపఖండంలో కూడా ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి పోరాడితే కంపెనీ పాలన అంతరించి తాము స్వతంత్ర పాలకులమవుతామని కొందరు ముస్లిం పరిపాలకులు భావించారు. వారిలో నిజాం తమ్ముడు, కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా ఉన్నారు. పైగా దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించిన ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా కర్నూలును ఎంచుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రహస్యం చిత్రంగా బయటపడింది. [[1839]] వేసవి కాలంలో హైదరాబాదు నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పని చేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి అందుకంగీకరించగా ఒక రక్షరేకు(తాయెత్తు) చేతికిచ్చి మూసీనదిలో పారవెయ్యమన్నది. దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా భారీ తిరుగుబాటుకు ప్రయత్నాలు పంపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోట గోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేసినట్టు బయటపడింది.
== మరణం ==
నవాబు తలపెట్టిన కుట్ర 1839లో భగ్నమయ్యాకా అతని రాజ్యాన్ని తాము లాక్కుని, రాజకీయ ఖైదీగా తరలించి విచారణ ప్రారంబించారు. రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. అతను క్రమంతప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ మహమ్మదీయుడు ఫకీరు వేషంలో వచ్చి 1840లో పొడిచి చంపాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు