గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1940 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
గులాం రసూల్ ఖాన్ [[కర్నూలు నవాబులు]] పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్‌ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్‌ఖాన్‌కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ [[1792]] నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్‌ఖాన్ తండ్రి [[మునవర్ ఖాన్]] మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం [[మైసూరు]] నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. 1799లో[[1799]]లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి మరో మారు శ్రీరంగపట్నాన్ని ముట్టడించి [[టిప్పుసుల్తాన్]] ను చంపేశారు. ఈ పరిణామానంతరం సైనిక ఖర్చుల కింద నిజాం నుంచి [[కడప]], [[బళ్ళారి]] వంటి ప్రాంతాలతో పాటు కర్నూలు కూడా తిరిగి తీసుకున్నారు. దాంతో అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలోనే కర్నూలు నవాబులు ఈస్టిండియా కంపెనీకి సామంతులు అయ్యారు.
 
== రాజ్యాధికారం ==
గులాం రసూల్ ఖాన్ చివరి కొడుకు కావడం, సంప్రదాయసిద్ధంగా తండ్రి మొదటి కుమారుడికే రాజ్యం సిద్ధించడం వంటి కారణాలతో ఇతనికి అంత తేలికగా రాజ్యం రాలేదు. అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. నవాబు తమకు చేసిన సహాయాలు, అతని విశ్వాసం పరిగణించి ఆ ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో గులాం రసూల్‌ఖాన్ కర్నూల్ నవాబు అయ్యారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. క్రీ.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు