శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: శ్రీ కృష్ణదేవ రాయలు కొలువులో ఉండి ఆయనకు సేవచేసిన ప్రముఖ రా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శ్రీ కృష్ణదేవ రాయలు]] కొలువులో ఉండి ఆయనకు సేవచేసిన ప్రముఖ రాజసేవకులు వీర్లు.
 
===అమరం తిమ్మరసయ్య===
 
తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాలవల్ల కృష్ణదేవరాయలవారి కొలువులో అవసరం తిమ్మయనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటికావలి ద్వారపాలకుల పై అధికారియైఉన్నట్టున్నూ, అతడు వేయిమంది సనికులకధికారి అని, చిన్న సంస్థానమునేలే సామంతమండలేశ్వరుడిన్నినీ, అతనిని అమరం తిమ్మరసయ్య, తిమ్మప్పనాయకుడు అనిపిలిచేవారని, ఆయనకు రాయలవారిదగ్గర చాలా చనువు ఉన్నట్లు, చాలా మందికి ఆయన రాయలవారి దర్సనం చేయించి అనేక సందర్భాలలో చాలా ఉపకారాలు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలో ఉన్న దానశాసనాలలో అవసరం నరసయ్య, తిమ్మయ్య, నరసయ్య, అనే ముగ్గురు అన్నదమ్ములపేర్లు, వారితల్లి బసవమ్మగారి పేరున్నూ కనబడుతూఉంది. శా.శ. 1434 కు సరియైన ఆంగీరసనామ సం. క్రీ. శ. 7-8-1512 నాటి శాసనంలో ఈకుటుంబంవారికి తిరువెంగళనాధుడు ఇలువేల్పు అన్నట్లు, అవసరం నరసయ్య తిమ్మయ్యగార్లు "రాయర బాగిల అవసరద" - అనగా రాయలవారి తలుపుల దగ్గర ఉండే ద్వారపాలకులైనట్లున్నూ వివరింపబడినది. ఈయననే వాకిటికావలి తిమ్మన్న అని చెప్పుదురు.
 
Line 13 ⟶ 12:
అవసరం తిమ్మయని, అమరం తిమ్మయని, వాకిటి తిమ్మయ్యని అని వేరు పేర్లు గల తిమ్మప్ప నాయకుడు రాయల ముఖ్య రాజ సేవకుడుగా చెప్పుచుందురు.
 
===ఊడియం ఎల్లప్పనాయకుడు===
 
ఊడియం ఎల్లప్పనాయకుడనే రాజోద్యోగి రాయలవారికీ, ఆయనతరువాత రాజ్యం చేసిన అచ్యుత దేవరాయలవారికీ సన్నిహితభృత్యుడిగా ఉండేవాడు. ఊడియమనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు "కల్ తేరు" అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లూ, తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి దానం చేసినట్లున్నూ క్రీ.శ. 1524 నాటి శాసనం వల్ల కనబడుతూ ఉంది.
 
===అడపం బయ్యప్పనాయకుడు===
 
అడపమంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యములుంచే సంచి. దీనిని సంబెళమని కూడా అంటారు. ఆకాలంలో సామాన్యులుకూడా ఎక్కడకువెళ్ళినా ఒక అడపను పట్టుకు వెళ్ళేవారు. రాయలువారు రచించిన [[ఆముక్తమాల్యద]] 7వ ఆశ్వాసంలో 7 వ పద్యంలో దీని వర్ణన కనబడుతూఉంది. ఇది శ్రీమంతులు అనుభవించే భోగాలలో ఒకటి. కాశ్యపగోత్రుడైన తిమ్మప్పనాయకుడి కుమారుడైన ఈ బయ్యప్ప రాయలవారికాలంలోను, అచ్యుతరాయలవారి కాలంలోను కూడా ఉద్యోగంచేసినట్లు అతడు తిరుపతివెంకటేశ్వరులకు 55,320 నార్పణములు సమర్పించి క్రీ.శ 6-9-1538 సం.లో చెక్కించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఇతడింకా కొన్ని గ్రామాల వల్ల వచ్చే సొమ్మునుకూడా దేవుడికి సమర్పించాడు. అందువల్ల ఇతడొక శ్రీమంతుడై ఉండవచ్చును.
 
===కట్టి తిమ్మన===
కట్టితిమ్మన
 
జిల్లేళ్ళ బసవనాయకరు కుమారుడైన తమ్మునాయకరు అనే అతడు రాయలవారి కట్టిక, అనగా వెండిబెత్తమును పట్టుకొని ఉండే వేత్రధరుడు. ఇది యొక రాజలాంచనము. అతడొక దళవాయి అని, అతడు తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి నిత్యనైవేద్యనిమిత్తము 1200 నార్పణములు సమర్పించినప్పుడు క్రీ.శ. 1523 సం.లో చెక్కించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఈశాసనమే తెలుగులో కూడా క్లుప్తంగా వ్రాయబడియున్నది. అందులో ఈకట్తితిమ్మన అనుసంధానం రామానుజయ్యగారి శిష్యుడని, అతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య అని ఉదహరింపబడియున్నది. శత్రువుల మీదికి దాడివెడలి జయించినందువల్లనే దాడినేని అనే బిరుదు ఇతనికి వచ్చియున్నది.
 
===విద్వత్సభారాయరంజక శ్రీరంగరాజు===
 
రాయలవారి పూర్వుల కాలంనుంచి విజయనగరరాజభవనంలో ఒక నాటకశాల ఉండేది. రాయలవారి కాలంలో ఒక నాట్యశాల, నృత్యశాల ఉండేవి. రాయల వారు తన ఆస్థానంలో సంగీతవిద్వాంసులను పోషిస్తూ సదా విద్యాగోష్టిలో కాలక్షేపంచేస్తూ విద్వత్ సభారయలనే బిరుదువహించారు. నృత్యము చేసి సంగీతము పాడి ఆయనను రంజించే ఆటపాటలకు మేళమొకటి ఉండేది. ఈమేళానికి నాయకుడు తిరుమలనాధుని కుమారుడైన శ్రీరంగరాజు. అతనికి విద్వత్ సభారాయరంజక అనే బిరుదు ఉండేది. రాయల వారాయనకు గొప్ప జాగీరు లిచ్చారు. అందులో ఎర్లంపూడి అనే గ్రామాన్ని ఈ శ్రీరంగరాజు క్రీ. శ. 1514లో వెంకటేశ్వరుల స్వామివారికి సమర్పించాడు. ఈ శ్రీరంగరాజు కుమార్తె అయిన రంజకం కుపాయి అనే కుప్పసాని క్రీ.శ. 1512లో చేసిన దానం ఒకటి కనబడుతున్నది.