రావు వేంకట మహీపతి గంగాధర రామారావు I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
రావు వేంకట మహీపతి గంగాధర రామారావు (1862-90) పిఠాపురం సంస్థానపు ప్రభువు, సంగీత, సాహిత్య పోషకుడు. ఆయన పరిపాలన కాలంలో ఎందరో కవులు, సంగీతకారులు, మహా పండితులు మొదలైన వారికి భూములు ఇనాముగా ఇచ్చి కళలను పోషించారు. ఆయన దాతృత్వం, పౌరుషం, లౌక్యం వంటి లక్షణాల గురించిన కథలు అనేకం ఆ ప్రాంతమంతటా వ్యాప్తిలో వుండేవి.
== మతభావాలు ==
గంగాధర రామారావు వైష్ణవమతాభిమాని. ఆయనకు శ్రీవైష్ణవ పీఠస్థులైన వానమామలై జియ్యంగారు గురుత్వం వహించేవారు. స్మార్తులకు శంకరాచార్య పీఠములెటువంటివో విశిష్టాద్వైతులకు ఈ పీఠమూ అటువంటిది. ఆ పీఠానికి అన్నివిధాలా రామారావు అండగా ఉండేవారు. ఆ పీఠస్థుల వద్దకు రామారావు దర్శనార్థియై వెళ్లారు. పాదపూజకు గురువులు రూ.లక్ష కోరారు. ఐతే గంగాధర రామారావు రూ.యాభై వేలు మాత్రమే ఇవ్వదలుచుకున్నారు. గురువు గట్టిగా పట్టుబట్టాకా, రామారావుకు ఇలా పట్టుపట్టే గురువు ఏం సన్యసించినట్లు అని ఒక ఉపాయం ఆలోచించారు. తిరుమణి చూర్ణంతో నిలువు నామం దిద్దబడ్డ తన నుదుటన భస్మం తెప్పించుకుని అడ్డంగా త్రిపుండ్రాలను అడ్డబొట్టుగా పెట్టారు. రుద్రాక్షలు తెచ్చి మెడలో ధరించారు. ఆపైన సగౌరవంగా వారి గురువుతో ''నా పేరు తెలుసుకదా గంగాధర రామారావు. దీనిని బట్టి తిరుమణి తిరుచూర్ణధారణకు ఎంత ఆవశ్యకత ఉందో విభూతి రుద్రాక్షధారణకూ అంతే అధికారం ఉంది. శిష్యునయందు దయవుంచండి'' అంటూ నిష్క్రమించారు.
 
== దానధర్మాలు ==