రంగనాథ రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందిన '''రంగనాథ రామాయణం'''ను [[పాలమూరు జిల్లా]] కవులలో మిగుల ప్రఖ్యాతిచెందిన [[గోన బుద్ధారెడ్డి]] రచించాడు. ఇది ద్విపద ఛందస్సులో వ్రాయబడింది. క్రీ.శ.1260లో తిక్కన రచించిన రామాయణం ఉత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన:ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 8</ref>
== కర్తృత్వం ==
వర్థమానపురాన్ని ఏలిన గోనబుద్దారెడ్డి తండ్రి కోరిక మేరకు క్రీ.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు.<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు</ref> [[పాల్కుర్కి సోమనాథుడు]] తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.
 
== ప్రాచుర్యం ==
"https://te.wikipedia.org/wiki/రంగనాథ_రామాయణము" నుండి వెలికితీశారు