గ్వాలియర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 26:
గ్వాలియర్ జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బింద్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[దతియా]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[శివ్పురి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[షెయోపూర్]] జిల్లా మరియు వాయవ్య సరిహద్దులో [[మొరెన]] జిల్లా ఉన్నాయి. జిల్లా గ్వాలియర్ డివిషన్లో ఉంది.
=== స్వతంత్ర సమరం ===
[[1857]] స్వాతంత్ర సమరంలో గ్వాలియర్కు ప్రత్యేక స్థానం ఉంది. కల్పి (ఝాంసీ) బ్రిటిష్ పరం అయ్యాక ఝాంసీ లక్ష్మీభాయి గ్వాలియర్ కోటలో ఆశ్రయం కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి భయపడి
గ్వాలియర్ రాజు రాణిభాయికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. అయినప్పటికీ సైన్యం రాణిభాయి మీద గౌరవంతో కోటలో ఆశ్రయం ఇవ్వడానికి మద్దతు తెలిపారు. ఏమాత్రం ఎదిరింపు లేకుండా రాణిభాయి కోటలో ప్రవేశింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాణిభాయి కొరకు గ్వాలియర్ కోటమీద దాడి చేసింది. రాణిభాయి అపారమైన బ్రిటిష్ సైన్యంతో తన స్వల్పసైన్యం సాయంతో అత్యంత సాహసోపేతంగా పోరాడి వీరస్వర్గం అలకరించింది. గ్వాలియర్ కోట బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. ఆనాటి మరపురాని చారిత్రక సంఘటనకు గ్వాలియర్ కోట సాక్ష్యంగా నిలబడింది.
=== గురురాధా కిషన్ ===
స్వతత్ర సమర నాయకులలో ఒకరైన గురు రాధా కిషన్ తమ సమకాలీన స్వాతంత్ర యోధుడు రామచంద్ర సర్వేట్ పట్ల గ్వాలియర్ రాజాస్థానం అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమం చేపట్టాడు. [[ఇండోర్]] లో స్వాతంత్ర సమరానికి చురుకుగా పాల్గొన్నందుకు వ్యతిరేకంగా గ్వాలియర్ రాజాస్థానం ఆయనకు అరెస్ట్ వారెంటు పంపిన తరువాత రాధాకిషన్ గ్వాలియర్లో ప్రవేశించాడు. బ్రిటిష్ పాలనా కాలంలో పేదల ఆర్ధికాభివృద్ధి కొరకు గురు రాధా కిషన్ విశేషంగా కృషిచేసాడు. ప్రముఖ గాంధేయవాది " దాదా ధర్మాధికారి " రాధా కిషన్ కార్యకలాపాలను హృదయపూర్వహంగా ఆదరించాడు.
|