వైశాలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 29:
===పురాతన వైశాలి===
రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజా వైశాల్ పాలించాడని అందుకే ఇది వైశాలి అయిందని పురాణకథనాలు వువరిస్తున్నాయి. బుద్ధిజం, జౌనిజం ఆరంభానికి ముందే వైశాలి విబ్రంత్ రిపబ్లిక్
రాజధానిగా ఉండేది. క్రీ.పూ 599 లో మహావీరుడు జన్మించక ముందే రిపబ్లిక్గా ఉన్న విబ్రంత్ ప్రపంచంలో మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. తరువాత పురాతన గ్రీసులో ప్రజారాజ్య పాలన ఆదంభం అయింది. <ref>http://p2.www.britannica.com/eb/article-9074639/Vaisali</ref> ఆరోజులలో విశాలి ఒక మహానగరం మరియు విశాలరాజ్యానికి రాజధానిగా ఉండేది.
హిమాలయాలలో గంగాభూభాగంలో ఉండేది. (ప్రస్తుత బీహార్ రాష్ట్రం) పురాతన వైశాలి గురించి స్వల్పంగా మాత్రమే వివరాలు లభిస్తున్నాయి. విష్ణుపురాణం వైశాలి రాజ్యానికి సంబంధించిన 24 రాజుల గురించి వివరిస్తుంది. వీరిలో మొదటి వాడు నాభాగుడు. ఆయన మానవ హక్కుల రక్షణార్ధం సుంహాసనాన్ని విసర్జించి భూమిని దున్నాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. వీరిలో చివరి రాజు సుమతి. సుమతి దశరధుని సమకాలీనుడని విశ్వసిస్తున్నారు.
=== పరిశోధనలు ===
వైశాలిలోని మహాజనపదాలు పలు బౌద్ధ మరియు జైన గ్రంధాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. లభించిన సమాచారం అనుసరించి క్రీ.పూ 6వ శతాబ్ధంలో గౌతమబుద్ధుని పుట్టుకకు మునుపే 563లో ఇక్కడ ప్రజారాజ్యం అవతరించినట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచంలోని మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. వైశాలి ప్రజారాజ్యంలో మహావీరుడు జన్మించాడని, గౌతమ బుద్ధుడు తన చివరి ప్రసంగాన్ని వైశాలి నగరంలో చేసాడని ఆ సందర్భంలో తన పరినిర్వాణం గురించి ప్రకటించాడని భావిస్తున్నారు. వైశాలి అమ్రపాలి ప్రాంతమని భావిస్తున్నారు. అమ్రపాలి గొప్ప న్యాయాధికారి, బౌద్ధమత రచయిత మరియు బుద్ధుని శిష్యుడు.
|