రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1911 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి అదనపు సమాచారాన్ని జోడిన్చాదమైనది.
పంక్తి 1:
'''రావిచెట్టు రంగారావు''' [[తెలంగాణ]] విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు.
 
వీరు నల్లగొండ జిల్లా [[దండంపల్లి]] గ్రామంలొ 1877 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది. ఆమె కూడా భర్తతో పాటు విద్యా వికాసానికి కృషిచేసింది. సాంఘిక విద్యా కార్యక్రమాలతో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యకై ఇద్దరూ పాటుపడ్డారు. ఆంద్ర మహిళా సంఘాన్ని స్థాపించిన లక్ష్మీనరసమ్మగారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతల్ని చేపట్టారు. అనాధలకు విద్యాదానం చేయడం, ఆపన్నులను ఆడుకోవడం ఈ భార్యాభర్తలకు సహజ లక్షణాలు.
 
రావిచెట్టు రంగారావు గారు హైదరాబాద్ లో పేరుమోసిన శ్రీమంతులు, సరసులు, విద్యాధికులు, సాహిత్యాభిమానులు. వీరు [[కొమర్రాజు లక్ష్మణరావు]] తో కలసి [[శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం]], పిమ్మట [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]]ని స్థాపించారు. అంతకుసంస్కృత ముందేభాషపై తానుఎనేలేని గౌరవమున్నవారు. అందుకే ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి నడుపుతున్నదాని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన "శ్రీ శంకర భగవత్పూజ్యపాద గీర్వాణరత్న మంజూష" అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావుగారి ఇంట్లోనే స్థాపించబడినది. ప్రథమ కార్యదర్శి గా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు. హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల పేరిట గ్రంథాలయం స్తాపించినట్టే రావిచెట్టు రంగారావు గారు హనుమకొండలో 'రాజరాజనరేంద్ర' గ్రంథాలయాన్ని 1904 లో స్థాపించారు.
 
మునగాల రాజుతోనూ, కొమర్రాజు లక్ష్మణరావు గారితోనూ సహచర్యం గట్టిపడ్డాక రంగారావు గారు మద్రాసుకు తరచూ వెళ్ళేవారు. అక్కడ 1905 లో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిణి స్థాపించి పుస్తక ప్రచురణలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముద్రణ మద్రాసులో లక్ష్మణరావు గారి పర్యవేక్షణలోనుండినా పుస్తకాలను చందాదారులకు చేర్చడం ఇతర వ్యాపార సంబంధమైన రవాణా కార్యక్రమాలను రంగారావు గారు హైదరాబాద్ నుండి స్వయంగా చేపట్టారు. తాము సకుటుంబంగా మద్రాసుకు తరలి వెళ్లి ఆర్నెల్లపాటు అక్కడే నివసిస్తూ గ్రంతమండలిని ఒక దారిలో పెట్టారు.
 
రావిచెట్టువారు స్వదేశీ ఉద్యమాన్ని బలపరిచారు. స్వదేశంలో తయారైన వస్తువుల ప్రచారానికి ఆయన దృఢ సంకల్పంతో పనిచేశారు.
Line 9 ⟶ 11:
1908 సంవత్సరంలో భయంకరమైన [[మూసీనది]] వరదలు హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావుగారు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్ధులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో [[ఆదిరాజు వీరభద్రరావు]] గారొకరు.
 
దేశానికి ఎంతో సేవ చేయవలసిన రంగారావు గారు తమ ముప్ఫైరెండో ఏటనే అకాల మృత్యువు వాత పడ్డారు. రంగారావు గారు 1911లో తన 34వ యేట మరణించారు. దేశం ఒక మంచివాడిని కోల్పోయింది.
 
రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు గారు 1910 లో 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంతమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
 
==మూలాలు==
* రావిచెట్టు రంగారావు, తెలంగాణలో జ్ఞానదీపం వెలిగించాడు, జి.వెంకట రామారావు, తెలుగు వెలుగులు, ఆంధ్ర ప్రదేశ్, జూన్ 2010 సంచిక, పేజీ: 17.
* సమగ్రాంధ్ర సాహిత్యం : కొమర్రాజు వారి సహచరులు(నాల్గవ సంపుటి), ఆరుద్ర, తెలుగు అకాడమి, హైదరాబాద్. 2005. పేజీ: 252-3.
 
[[వర్గం:నల్గొండ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1877 జననాలు]]