మక్కా మసీదు (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
[[చార్మినారు]] కు నైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు [[మక్కా]] నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉన్నది. ఈ మస్జిద్ లో [[మహమ్మదు ప్రవక్త]] యొక్క "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
== చరిత్ర ==
1617 లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. [[అబ్దుల్లా కులీ కుతుబ్ షా]] మరియు [[తానా షా]] కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన [[ఔరంగజేబు]] పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది. 1830లో తన కాశీయాత్రలో హైదరాబాద్‌ను తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] పర్యటించారు. ఆయన కాశీయాత్రచరిత్రలో వ్రాస్తూ ''షహరు నడుమ మక్కామజ్జిత్ అనే తురకల జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడియున్నవి కనుక బహుదూరానికి తెలియయుచున్నవి.''
 
==మస్జిద్ ప్రాంగణం==