కేతవరపు రామకోటిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==జీవిత విశేషాలు==
1931లో జన్మించాడు. వినుకొండ, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేశాడు. 1954లో గుడివాడ కాలేజీలో లెక్చెరర్‌గా చేరి 3 సంవత్సరాలు పనిచేశాడు. త్రిపురనేని మధుసూధనరావు, చలసాని ప్రసాద్, శివసాగర్ మొదలైన వారు శిష్యులుగా ఉన్నారు. 1959 ప్రాంతంలో హైదరాబాదు చేరి [[బిరుదురాజు రామరాజు]] పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పము తత్త్వదర్శనము అనే అంశం మీద పి.హెచ్.డి చేశాడు. నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్‌లో తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా నియమించబడ్డాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
 
==రచనలు==