ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది. [[1916]] [[జులై 8]]వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమీషన్ అనంతపురానికి వచ్చి ఈ కళాశాలను పరిశీలించి చేసిన సిఫారసు మేరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధం అయింది. రెండేండ్లు అనుబంధంగా ఉండి [[1918]] [[జూన్ 6]]లో ప్రథమశ్రేణి కళాశాలగా ఎదిగింది. ఈ ఎదుగుదలకు ప్రిన్సిపాల్ రంగనాథన్, డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]], లార్డ్ పెంట్‌లెండ్ కృషిచేశారు. మొదటి ఏడేండ్లలో కళాశాల కొత్త గదుల నిర్మాణంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. [[1920]] అక్టోబరు 23 న కేశవ పిళ్లై అధ్యక్షతలో తొలి వార్షికోత్సవం జరిగింది. ఈ కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్‌ అరుళానందం నేతృత్వంలో భౌతికమైన వనరులు చేకూరాయి. ద్వితీయ దశకంలో కళాశాల ప్రగతి పుంజుకుంది. ఎన్.ఆర్.కృష్ణమ్మ ప్రిన్సిపాల్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అభివృద్ధి దిశగా పెనుమార్పులు వచ్చాయి. అధ్యాపకులలో అంకితభావం, విద్యార్థులలో అధ్యయన కాంక్ష, పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన, క్రీడల్లో ప్రదర్శించిన నైపుణ్యం అంతా కలిసి ఈ కళాశాల కీర్తిని పెంచాయి.
 
[[1926]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]] అనుబంధాంగా ఉన్న ఈ కాలేజి [[1930]]లో మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఆ ఏడే కళాశాలకు హాస్టల్ భవనం ఏర్పడింది. [[1940]]లో మద్రాసులోని సెయింట్ జాన్స్ దళానికి అనుబంధంగా ఈ కళాశాలలో అంబులెన్స్ విభాగం ఏర్పడింది. పేద విద్యార్థులకు విద్యార్థి వేతనం, విద్యలో వెనుకబడినవారికి ఉచితంగా ట్యుటోరియల్స్, ఫోటోగ్రఫీ క్లబ్, విహారయాత్రలు, వస్తుప్రదర్శన వంటివి ఈ కళాశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉత్తేజాన్ని కలిగించారు. [[1945]]లో మద్రాసులోని యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూలు అనుబంధంగా ఈ కళాశాలలో ఒక విభాగం వెలిసింది. [[1946]]లో ప్రిన్సిపాల్ పి.ఎన్.గౌడ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు జరిగాయి. [[1947]]లో ఈ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారింది. ఆంధ్రరాష్ట్ర అవతరణతో ఈ కళాశాల [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]] అనుబంధంగా ఉండి తర్వాత కొంతకాలానికి [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం |శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి]] అనుబంధమైంది. [[1978]]లో ఈ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ ఉత్సవాలకు అప్పటి రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] హాజరయ్యాడు. [[1981]]లో [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాయం]] ఏర్పడ్డాక ఈ కళాశాల దానికి అనుబంధ కళాశాలగా మారింది.