ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 38:
దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది. [[1916]] [[జులై 8]]వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమీషన్ అనంతపురానికి వచ్చి ఈ కళాశాలను పరిశీలించి చేసిన సిఫారసు మేరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధం అయింది. రెండేండ్లు అనుబంధంగా ఉండి [[1918]] [[జూన్ 6]]లో ప్రథమశ్రేణి కళాశాలగా ఎదిగింది. ఈ ఎదుగుదలకు ప్రిన్సిపాల్ రంగనాథన్, డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]], లార్డ్ పెంట్లెండ్ కృషిచేశారు. మొదటి ఏడేండ్లలో కళాశాల కొత్త గదుల నిర్మాణంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. [[1920]] అక్టోబరు 23 న కేశవ పిళ్లై అధ్యక్షతలో తొలి వార్షికోత్సవం జరిగింది. ఈ కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్ అరుళానందం నేతృత్వంలో భౌతికమైన వనరులు చేకూరాయి. ద్వితీయ దశకంలో కళాశాల ప్రగతి పుంజుకుంది. ఎన్.ఆర్.కృష్ణమ్మ ప్రిన్సిపాల్గా సుదీర్ఘకాలం పనిచేసి అభివృద్ధి దిశగా పెనుమార్పులు వచ్చాయి. అధ్యాపకులలో అంకితభావం, విద్యార్థులలో అధ్యయన కాంక్ష, పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన, క్రీడల్లో ప్రదర్శించిన నైపుణ్యం అంతా కలిసి ఈ కళాశాల కీర్తిని పెంచాయి.
[[1926]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]]
శత వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ కళాశాల ప్రస్తుతం 31 డిగ్రీ కోర్సులు, 14 పి.జి.కోర్సులు అందజేస్తున్నది. 7964మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు<ref>{{cite news|last1=V. K.|first1=RAKESH REDDY|title=Anantapur Arts and Science College to turn 100 years|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/anantapur-arts-and-science-college-to-turn-100-years/article6749265.ece|accessdate=27 January 2015|work=The Hindu|date=2015-01-03}}</ref>. వీరిలో 90 శాతం విద్యార్థులు ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడినవారు. ప్రస్తుతం ఎన్.రంగస్వామి ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాడు.
|