కోవెల సంపత్కుమారాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''కోవెల సంపత్కుమారాచార్య''' [[1933]], [[జూన్ 26]]వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.<ref>{{cite news|last1=టి.|first1=శ్రీరంగస్వామి|title=కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు|url=http://visalaandhra.com/literature/article-137450|accessdate=13 December 2014|work=విశాలాంధ్ర దినపత్రిక|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్|date=042014-08-201404}}</ref> ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
==విద్య,ఉద్యోగం==
బాల్యంలోనే ఇతడు తండ్రి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు<ref>{{cite web|last1=యు.ఎ.|first1=నరసింహమూర్తి|title=విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార|url=http://eemaata.com/em/issues/201101/1671.html|website=ఈమాట|accessdate=14 December 2014}}</ref>. ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా [[వరంగల్లు]]లో జరిగింది. 1949-53 సంవత్సరాల మధ్య [[బందరు]] చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు<ref>{{cite news|last1=కొలనుపాక|first1=కుమారస్వామి|title=కమనీయం కోవెల'కలం'|url=http://www.prabhanews.com/specialstories/article-317479|accessdate=14 December 2014|work=ఆంధ్రప్రభ దినపత్రిక|publisher=ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాదు|date=11-08-2012}}</ref>. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ''ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి'' అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.