పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
'''పసునూరు శ్రీధర్ బాబు''' పేరు ఆధునిక తెలుగు కవిత్వావరణంలో సుపరిచితమైన పేరు. ఆయన తొలి కవితా సంకలనం [[అనేక వచనం]] 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుటి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా [[పాత్రికేయుడు]].
==బాల్యం-విద్యాభ్యాసం==
'''పసునూరు శ్రీధర్ బాబు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నల్లగొండ]] జిల్లాలోని [[మోత్కూరు]] లో [[1969]] , [[జూలై 21]] న జన్మించారు. ఆయన తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు [[నల్లగొండ]] జిల్లాలోని [[ఉత్తటూరు]], [[మోత్కూరు]] గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ లో ఉన్నత విద్య అభ్యసించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివారు. [[విశాఖపట్నం]] లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఆ తరువాత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ( M.C.J) పూర్తి చేశారు.
 
==వృత్తి జీవితం==