పేరడైజ్ లాస్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: రధం → రథం using AWB
పంక్తి 1:
[[File:GustaveDoreParadiseLostSatanProfile.jpg|thumb|upright|right|[[Gustave Doré]], ''Depiction of Satan'', the antagonist of [[John Milton]]'s ''Paradise Lost'' c. 1866]]
పరిశుద్ధ గ్రంధము (Holy Bible)లో పాతనిబంధన (Old Testament) ఆదికాండము (Genesis)లో ఉన్న [[ఆదాము]] (Adam), [[అవ్వ]] (Eve) ల చరిత్ర యొక్క అద్భుత కావ్య రూపమే '''పేరడైజ్ లాస్ట్''' (Paradise Lost). ఇది ఇంగ్లండుకు చెందిన [[జాన్ మిల్టన్]] (John Milton) చే వ్రాయబడినది. ఈ కావ్యము ఆంగ్ల సాహిత్యములో బహు ఖ్యాతినొందినది . పన్నెండు పుస్తకాలుగా విభజింపబడిన ఈ కావ్యములో [[సైతాను]] (Satan) మాయతో భార్యా భర్తలైన ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమణ చేయడం, ఫలితంగా వారు ఏధేను వనము (Garden of Eden) నుండి బహిష్కరింపబడటం వంటి దృశ్యాలను జాన్ మిల్టన్ చక్కగా అభివర్ణించాడు.
 
==రచయిత==
పంక్తి 16:
జరిగిన దాని గురించి అవ్వ తన భర్త అయిన ఆదాముతో చెప్పగా, దేవుడు చెప్పినది విన్నంత కాలం ఏ కీడు జరగదని అభయమిస్తాడు. సైతాను వేస్తున్న ఎత్తుగడలను వివరించడానికి దేవుడు ఆదాము అవ్వల వద్దకు రాఫేలు (Raphael) అను దూతను పంపిస్తాడు. జరుగుతున్న తిరుగుబాటు గురించి అదాము అవ్వలకు రాఫేలు వివరిస్తాడు.
 
లూసిఫర్ (అలియాస్ సాతాను) దైవ కుమారుడి పట్ల అసూయగా ఉన్నందున తెలివైన మాటల ద్వారా సుమారు మూడవ వంతు దేవదూతలను ఉత్తర దిశలో తీసుకెళ్ళాడని, వారిలోనుండి అబిదియేలు (Abdiel) అను దేవదూత మాత్రమే దేవుడి వైపు తిరగడం జరిగిందని చెబుతాడు. సాతాను తన సైన్యంతో దేవుడిని ముట్టడించాడని, సైతాను మిఖాయేలు (Michael) దేవదూత చే ముక్కలు చేయబడ్డా చావలేదని, మొదటిరోజు యుద్ధం తర్వాత సైతాను సైన్యం ఫిరంగిని నిర్మించుకొన్నది. రెండవరోజున పాక్షికంగా విజయమొందారని, తరువాత దేవుడి సైన్యం కొండలను సాతాను సైన్యం మీదకు విసిరేయగా సాతాను సైన్యం ఆ కొండల క్రింద నాశనమైయ్యారని, దేవుడు తన కుమారుడిని రధంరథం మీద పంపాడని, ఫలితంగా సాతాను సైన్యం నరకంలోకి త్రోసివేయబడిందని చెబుతాడు.
 
దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని సృష్టించిన విధానాన్ని మిఖాయేలు అదాముకు వివరించి చెబుతాడు. ఆదాము గ్రహాల కదలికల గురించి ప్రశ్నలు అడుగగా, కొన్ని ప్రశ్నలు దేవుడి విజ్ఞానికే వదిలేయాలని చెబుతాడు. ఆదాము కూడా తాను సృష్టింపబడిన విధానం, ఏధేను వన పరిచయం, అవ్వ సృష్టింపబడిన విధానం వగైరా అన్నీ మిఖాయేలుకు వివరించి చెబుతాడు. అవ్వతో తాను సాగించే దాంపత్య జీవనంలో ఉన్న మాధుర్యాన్ని కూడా చెబుతాడు. అంతా విన్న తరువాత రాఫేలు ఆదాముకు సాతాను గురించి హెచ్చరించి అక్కడనుండి నిష్క్రమిస్తాడు.
పంక్తి 22:
ఎనిమిది రోజుల తర్వాత సాతాను మనుష్యుని మోసపుచ్చుట కొరకు ఏధేను వనానికి తిరిగివచ్చి నిషిధ ఫల వృక్షానికి చేరువలో ఉన్న జల ఊట వద్ద సర్ప అవతారమెత్తి వేచియుంటాడు. కలిసికట్టుగా ఉంటే సాతాను మోసపుచ్చలేడని ఆదాము తన భార్య అయిన అవ్వతో చెబుతాడు. ఆదాము మాటలను అవ్వ పురుషాధిక్య మాటలుగా భావిస్తుంది. భర్త అయిన అదాము ఆలోచనకు వ్యతిరేకంగా అవ్వ ఒంటరిగా తోట పని చేయడానికి దూరంగా వెళుతుంది. పురుషుని కంటే స్త్రీని ప్రలోభపెట్టడం తేలికగా భావించిన సాతాను అవ్వ వెనుకకు వస్తాడు. సాతాను తన తెలివైన లౌకిక మాటలతో అవ్వ నిషేధ ఫలాన్ని తినేలా చేసి అదృశ్యమైపోతాడు.
 
అవ్వకు లోక రీతిగా కళ్ళు తెరవబడతాయి. తాను సాయంత్రంలోగా ఇంటికి చేరతానని భర్త అయిన ఆదాముకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకొంటుంది, సాతాను ప్రలోభంతో తాను చేసిన పాపానికి దేవుడు తనను శపిస్తాడని, ఆదాముకు వేరే స్త్రీని ప్రధానం చేస్తాడని, ఆదాముకు కూడా నిషేధ ఫలాన్ని ఇస్తే తనతో సమానమవుతాడని భావించి భర్త అయిన ఆదాము వద్దకు వెళుతుంది. తాను జ్ఞానాన్నిచ్చే ఫలాన్ని తిన్నానని అందువలన కళ్ళు తెరువబడ్డాయని అవ్వ కంగారుగా చెప్పడంతో ఆదాము విస్మయం చెందుతాడు. ఆదాము తన భార్య చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని పంచుకోవాలని ఉద్దేశ్యంతో నిషేధ ఫలాన్ని అవ్వనుండి తీసుకొని తింటాడు, తన భార్యను మోహపు చూపుతో చూస్తాడు. లైంగిక కార్యం కోసం వారిద్దరూ పొదల్లోకి పారిపోతారు. ఒకరినొకరు నగ్నంగా ఉండుట చూసుకొని సిగ్గు పడి వారి మర్మాంగాలను ఆకులతో కప్పుకుంటారు. ఒకరినొకరు నిందించుకొంటారు.
 
మనిషి పతనమైనట్లు దేవలోకంలో దూతలు చెప్పుకొంటారు. మనుష్యుల మీదను మరియు సర్పము మీదను తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుడిని పంపిస్తాడు. కేవలం కృప ద్వారానే మనుష్యుడు మరణాన్ని జయించవచ్చని దేవుని కుమారుడు చెబుతాడు. జాలితో కుమారుడు ఆదాము అవ్వలకు వస్త్రములు ఇస్తాడు.
 
పాపము మరియు మరణము భూమికి మరియు నరకానికి మధ్య ఒక మార్గాన్ని సృష్టిస్తాయి. నరకలోకంలో సాతాను సింహాసనంపై కూర్చొని తన విజయాన్ని ఇతర దెయ్యాలతో పంచుకుంటాడు. అందరూ సర్పాలుగా మారిపోతారు. వారి మధ్య కనిపించిన జ్ఞాన ఫలము తినగా అది బూడిదైపోతుంది. భూమి పైకి వెళ్ళిన పాపము మరియు మరణం అను దెయ్యాలను దేవుడు నరక లోకంలో బంధిస్తాడు.
 
ఆదాము అవ్వలు పశ్చాత్తాప పడతారు. అవ్వ ఆదాముకు లోబడి క్షమాపణ కోరుకుంటుంది. శొకసంద్రంలో ఉన్న అవ్వను ఆదాము ఓదారుస్తాడు. ఆదాము అవ్వలను ఏధేను వనంనుండి బయటకు పంపడానికి దేవుడు మిఖాయేలు దూతను పంపిస్తాడు. మిఖాయేలు ఆదామును ఒక కొండ పైకి తీసుకువెళ్ళి బైబిలు సంబధిత చరిత్రను రక్షకుడైన ఏసుక్రీస్తు జననం వరకూ వివరిస్తాడు. మిఖాయేలు ఆదాము అవ్వలను ఏధేను వనము బయటకు సాగనింపుతాడు. వారిద్దరూ క్రొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి క్రొత్త జీవితాన్ని మొదలుపెడతారు.
పంక్తి 37:
*http://www.afghanjc.com/wp-content/uploads/2013/03/ParadiseLost.pdf
 
[[వర్గం:ఆంగ్ల సాహిత్యం]]
 
[[వర్గం:క్రైస్తవ ఆంగ్ల సాహిత్యంమతము]]
[[వర్గం: క్రైస్తవ మతము]]
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/పేరడైజ్_లాస్ట్" నుండి వెలికితీశారు