మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: శాఖాహార → శాకాహార using AWB
పంక్తి 18:
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) [[డిసెంబర్ 26]], [[1914]]న [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా [[హింగన్‌ఘాట్‌]]లో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా [[కుష్టు]] రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై [[చంద్రాపూర్]] జిల్లాలో [[ఆనంద్‌వన్]] ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి [[2008]], [[ఫిబ్రవరి 9]]న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.
==తొలి జీవితం==
బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref> name="rediff.com">http://www.rediff.com/freedom/amte3.htm </ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా [[మహాత్మా గాంధీ]] వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం [[సేవాగ్రం ఆశ్రమం]]లో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
==వివాహం==
[[1946]]లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.<ref> http://mss.niya.org/people/amte.php </ref>
==ఆనంద్‌వన్==
బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి [[మహారాష్ట్ర]]లోని [[చంద్రాపుర్]] జిల్లాలో ఈ ఆశ్రమాన్ని [[1951]]లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి (Forest of Joy). వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించినది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.<ref>http://www.rediff.com/news/2008/feb/09amte2.htm?zcc=rl</ref>
కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్ మరియు అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించినాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు [[1983]]లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.<ref>http://www. name="rediff.com"/freedom/amte3.htm</ref>
 
==బాబా ఆమ్టే మరియు గాంధీజీ సిద్ధాంతాలు==
బాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాల్ను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలంవరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రం ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, అతని సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు '''అభయసాధక్''' అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబాఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాఖాహారశాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ బ్రిటీష్ వరిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబాఆమ్టే కూడా [[నర్మదా బచావో ఉద్యమం]]లో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.
 
==మరణం==
పంక్తి 32:
[[ఫిబ్రవరి 10]]న అధికార లాంఛనాలతో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు ఆయన అంతిమ కోరిక మేరకు ఖననం చేశారు.
==అవార్డులు==
అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషిసల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు.<ref> http://www.rediff.com/freedom/amte3.htm The Miracle Worker </ref>
* [[1971]] : భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు.<ref>http://mha.nic.in/Padma/PadmaAwardsDir(1954-2007).pdf</ref>
* [[1974]] : [[మహారాష్ట్ర]] ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు.
పంక్తి 72:
{{గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు}}
{{రామన్ మెగసెసే పురస్కార విజేతలు (భారత దేశము)}}
 
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:2008 మరణాలు]]