మీనాక్షీ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఆశక్తి → ఆసక్తి (3) using AWB
పంక్తి 30:
'''మినాక్షీ బెనర్జీ''' Ph.D. (1988, బనారస్), భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఆమె "అకాడామీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ" మరియు "ద నేషనల్ సైన్స్ అకాడమీ" లకు ఫెలోషిప్ పొందారు. ఆమె NASI కు జీవితకాల సభ్యులు. ఆమె ఆల్‌బెర్ట్ ష్వైట్జర్ అంతర్జాతీయ బంగారు పతకాన్ని సైన్స్ రంగంలో పొందడమే కాల అనేక అవార్డులు అందుకున్నారు. ఈమె యు.జి.సి అవార్డును కూడా పొందారు. ఆమె ప్రస్తుతం భోపాల్ లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం లో జీవశాస్త్రవిభాగానికి అధిపతిగా యున్నారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ఆమె బాల్యంలో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం "అసాన్‌సోల్" లోని ఐరిష్ కాన్వెంట్,లొరెటో లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బాల్యంలో విద్యలో చురుకుగా ఉండుటచేత అందరిచేత ప్రశంసలు పొందారు. ఆమె బాల్యంలో తన యింటి పరిసరాలలో గల పెద్ద పూల తోటలో గడిపేటపుడు కొన్ని కీటకాలు పూల చుట్టూ తిరిగుటను నిశితంగా గమనించేవారు. ఈ పరిశీలన ఆమెను విజ్ఞాన రంగంపై తపన మరియు ఆశక్తినిఆసక్తిని రేకెత్తించింది. ఆ లేత ప్రాయంలోనే ఆమె లోతైన మనస్సులో శాస్త్రవేత్త లక్షణాలు ఆవిర్భవించాయి. ఆమె పాఠశాలలో చదువుకొనే కాలములో ఆమె చదువు, ఆటలు, సంగీతం, నాట్యము మరియు వక్తృత్వం పట్ల ఆశక్తిఆసక్తి కనబరచేవారు. ఆ రంగాల పట్ల అనేక బహుమతులు గెలుచుకున్నారు.కానీ ప్రకృతి ని అధ్యయనం చేయాలనే ఉత్సుకత మిగిలిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో సైన్స్ విభాగంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని నిర్మల కాలేజీ లో చేరారు. ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బి.యస్సీ ని బోటనీ ప్రధానాంశంగా చేశారు.అచట బి.యస్సీ (ఆనర్స్) మొదటి శ్రేణిలో మొదటి స్థానాన్ని పొందారు. అదే విశ్వవిద్యాలయంలో C.A.S నుండి బోటనీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.మాస్టర్స్ డిగ్రీ లో కూడా మొదటి శ్రేణిలో మొదటి స్థానం సంపాదించి బంగారు పతకాన్ని పొందారు.పి.హెచ్.డి కొరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేరారు. ఆమె సైనోబాక్టీరియా పై రాసిన ప్రత్యేక రచన ఆమెను సైనోబాక్టీరియాలజిస్టుగా చేసింది. ఆమె ప్రకృతిలో సాధారణంగా గల 43 ఆకుపచ్చని అందమైన సూక్ష్మజీవులపై పరిశోధనను ప్రొఫెసర్ హె.డి.కుమార్ తో కలసి పనిచేసి పి.హెచ్.డి పూర్తిచేశారు. ఆ తర్వాత భోపాల్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం భర్కతుల్లా) లో లెక్చరర్ గా 1989 లో చేరారు.
==ఉద్యోగాలు.గౌరవాలు, అవార్డులు==
1989 లో భర్కతుల్లా విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆమె 1997 లో రీడర్ గానూ, మరియు 2005 లో ప్రొఫెసర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె జీవ శాస్త్ర విభాగంలో అధిపతిగా యున్నారు. ఆమె అనేక అవార్డులను స్వంతం చేసుకున్నారు.
పంక్తి 45:
 
===ఉద్యోగాలు, పరిశోధనలు===
డాక్టర్ బెనర్జీ అనేక దేశాలకు వివిధ చర్చలు మరియు సమావేశాల కోసం సందర్శించారు. డాక్టర్ బెనర్జీ చురుకుగా శైవలం బయోటెక్నాలజీ మరియు సైనోబాక్టీరియల్ రీసెర్చ్ మరియు వాటి అనువర్తనాల యొక్క వివిధ కోణాలు నిమగ్నమై ఉన్నారు. ఈమె బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో అనేక విభాగాలకు అతిధి ఫాకల్టీగా యున్నారు మరియు మధ్య ప్రదేశ ప్రభుత్వం లోని ఉన్నత విద్యా శాఖలోని సెకండరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆమె 10 పి.హెచ్.డి లు మరియు 24 ఎం.ఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. ఆమె అంతర్జాతీయ మరియు జాతీయ పత్రికలలో 55 ప్రచురణలకు సమీక్ష లు చేశారు. ఆమె 65 కంటే ఎక్కువ జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఆమె విజయవంతంగా నేషనల్ నిధులు ఏజన్సీల 4 పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం వివిధ రకాల ఆల్గే బయో ఫెర్టిలైజర్స్ ఔషథ మొక్కల పై విస్తృత పరిశోధనల పట్ల ఆశక్తిఆసక్తి కనబరుస్తున్నారు మరియు చల్లని మరియు వేడి సహా విభిన్న ప్రాంతాలలో సహజంగా ఏకైక సైనోబ్యాక్టీరియా పై అధ్యయనాలు చేస్తూ యున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మీనాక్షీ_బెనర్జీ" నుండి వెలికితీశారు