మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: express → ఎక్స్ప్రెస్ using AWB |
||
పంక్తి 41:
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్జంక్షన్ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్ఆర్ఆర్ పాఠశాల ఉంది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్ఎస్ఆర్ పాఠశాలలోనే చదివింది.
ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్ గారు జిటి ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె,చందూర్ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. [[మద్రాసు]] కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. వారు ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో [[రేడియో]] లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్లో ఉన్న రేడియో స్టేషన్కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే [[ఆచంట జానకిరాం]], బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. [[మద్రాసు]] లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు.
==సాహిత్య సేవలు==
[[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రికలో [[1952]] నుండి ఆడవారి కోసం [[ప్రమదావనం (ఆంధ్రప్రభ శీర్షిక)|ప్రమదావనం]] అనే Dear Abby<ref>'''''Dear Abby''''' is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[http://www.
</ref> మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.
|