వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: వేధిక → వేదిక (5) using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|దామల చెరువు గ్రామమంలో మహాభారత నాటకాల సందర్భంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి]]
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంగా పగటి పూట జరిగే ధుర్యోధన వధ నాటకాని తీర్చి దిద్దిన ధుర్యోధన మట్టి విగ్రహం. దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము]]
Line 9 ⟶ 8:
నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, బజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడ ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒక వేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు. వారి వేషధారణకు కావలసిన ఆభరణాలు, ఆయుదాలు, బట్టలు, తెరలు వంటి వస్తువులను అద్దెకిచ్చె కొన్ని అంగళ్ళూ చిన్న పట్టణాలలో ఉండేవి.రాను రాను పల్లెవాసులు ముఖాలకు రంగులేసుకునే కాలం పోయింది. ఆ నాటకాలలో పద్యాలు పాడడానికే ఎక్కువ ప్రాముక్యత వుండేది. ఒక పద్యానికి సుమారు పది నిముషాలు సమయం రాగం తీసేవారు. దాన్ని ప్రజలు కూడ మెచ్చుకునేవారు. ఇలాంటి నాటకాలు రాత్రులలో సుమారు పది గంటలకు మొదలై తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ముగిసేయి. అంత సేపూ ప్రజలు ఓపిగ్గా కూర్చుని చూసేవారు.
==నాటకం తీరు==
ఒక వేషధారి వేదికమీదికి రాగానే.... తన పాత్ర పేరు చెప్పుకుంటూ పాట పాడుతూ ఆ
==వృత్తిరీత్యా నాటకాలాడేవారు==
పల్లె ప్రజలే నాటకాలను నేర్చి ఆడే కాలం పోయి..... వృత్తి రీత్యా నాటకాలాడే వారిని పిలిపించి పల్లెల్లో నాటకాలాడించే కాలం వచ్చింది. వారిని పిలిపించి నాటకాలాడించే వారు. వారి వద్ద వేష వస్త్రాలు, ఆయుదాలు, ఆభరణాలు, తెరలు, కిరీటాలు వంటివే కాక హార్మోనియం, తబలా వంటి వాయిద్య పరికరాలు కూడ వుండేవి. వీరు వృత్తి రీత్యా నాటకాలాడే వారు కనుక పాత్రకు తగిన దేహదారుడ్యం, హావ బావాలు బాగా వుండేవి. పైగా పద్యాలు, పాటలు రాగయుక్తంగా పాడేవారు. వేష ధారణ కూడ చాల బాగా వుండేది. వారు వృత్తిరీత్యా నాటకాలు వేసే వారు గనుక ప్రజలు మెచ్చక పోతే.... వారిని మరెవరు పిలువరు. కనుక జాగ్రత్తగా నటించేవారు. అలా మంచి పేరున్న బృందాలకు ఒక పల్లెలో నాటకం పూర్తవగానే మరొక పల్లె వారు తమ పల్లెలోకూడ నాటకం అడమని ఒప్పందం కుదుర్చు కునేవారు. కానీ వీరు కూడ సందర్బాను సారంగా పిచ్చి గంతు లేయడం, బూతుమాటలు విసరడం, వ్వంగ్య సంభాషణ వంటివి పూర్తిగా పోలేదు. పాత వాసనలు అలా ఇంకా కొనసాగేవి. ప్రేక్షకులు వాటిని స్వాగస్తున్నారు.
==మహా భారత నాటకాలు==
పల్లె వాసులు ముఖాలకు రంగులేసుకుని వీధుల్లో నాటకాలాడే రోజులలోనే..... ప్రధానమైన పల్లెల్లో అక్కడక్కడా పాండవుల ఆలయాలుండేవి. అక్కడ ప్రతి సంవత్సరం [[మహాభారతం]] పేరుతో... అందులోని 18 ఘట్టాలను 18 రోజుల పాటు రాత్రులందు ఆడేవారు. పగటి పూట ఆ రోజు రాతికి ఆడబోయే ఘట్టాన్ని పరికథ రూపంలో చెప్పేవారు. పగలు కూడ ప్రజలు బాగా వచ్చేవారు. రాత్రి నాటకాలకైతే చుట్టు ప్రక్కల పల్లె ప్రజలు ఎద్దుల బండ్లమీద వచ్చేవారు. [[భారతం]] జరిగే ఈ ప్రాంతం అంతా చాల కోలాహలంగా వుండేది. అదొక తిరుణాల లాగ వుండేది. చిన్న షాపులు, కాఫీ., టీ అంగళ్ళూ, పిల్లల బొమ్మలు అమ్మేవారు, రంగుల రాట్నం, కీలుగుర్రం, తోలుబొమ్మలాటలు, దొమ్మరాటలు, చక్రాలాట, చింత పిక్కలాటలు ఇలా అనేక హంగులతో ఆ ప్రాంతమంతా ఆ పద్దెనిమిది రోజులు చాల కోలాహలంగా వుండేది. కాలానుగుణంగా తర్వాతి కాలంలో విద్యుత్తు వచ్చినందున విద్యుత్తు దీపాలంకరణ కూడ వుండేది. దాంతో ఆ ప్రాంతమంతా చాల చాల వుత్సాహంగా కనబడేది. ఈ నాటకాలాడడానికి వృత్తి రీత్యా ఆడేవారినే ధనమిచ్చి రప్పించేవారు. వారితో బాటు పల్లెల్లోని ఔత్చాహికులు వేషాలు వేయడానికి చాల ఆరాట పడే వారు. ముఖానికి రంగు లేసుకోవాలంటే వారికెంత ఇష్టమో చెప్పలేము. అవిదంగా చిన్న చిన్న వేషాలు పల్లె వాసులు కూడ వేసే వారు. ప్రేక్షకులు కూడ వారిని ఆవిధంగానె ఆదరించే వారు. ఆ విధంగా మహా భారత నాటకాలు పద్దెనిమిది రోజుల పాటు జరిగేవి. ఇన్ని రోజుల పాటు నటీనటులు గాని, నాటక సమాజం గానీ ఎంతో నిష్టగా , ఒక యజ్ఞం లాగ పూర్తి చేసే వారు. చివరగా .... కొసరుగా మహాభారతానికి సంబంధంలేని ఒక్క నాటకాన్ని చివరి రోజున ఆడేవారు. దాంతో ఈ మహా యజ్ఞం పూర్తయ్యేది.
==మహాభారతంలో 3 ప్రధాన ఘట్టాలు==
Line 21 ⟶ 20:
ఎక్కువగా [[మహాభారతం]] లోని ఘట్టాలను, వీధి నాటకాలుగా వేసేవారు. వీరు కాకుండా నాటకాలు వేయడమే వృత్తి గా వున్న బృందాలు అక్కడక్కడా వుండేవి. వారిని పిలిపించి తమకు కావలసిన నాటకాన్నీ వేయించి ఆనందించేవారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. పల్లెవాసులు ఇప్పుడు మొఖాలకు రంగులేసుకోవడం లేదు. కాని వృత్తిగా నాటకాలేసే వారిని పిలిపించి [[మహాభారత]] ఘట్టాల నాటకాలు సుమారు ఇరవై రోజుల పాటు ఆడిస్తున్నారు. ఇందుకొరకు కొన్ని గ్రామాలకు కలిపి అక్కడ పంచపాండవుల విగ్రహాలున్న ఆలయాలున్నవి. అక్కడ ఈ భారతం జరుగుతుంది. ఇది ఒక పెద్ద జాతర లాగ రాత్రి పగలు కూడ జరుగుతుంది. పగలంతా మహాభారత ఘట్టాలను హరికథ రూపంలో కథ చెప్పితే అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. అదీ కేవలం చిత్తూరు జిల్లాలో ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.
==బక్కాసుర వధ==
పగటి పూట జరిగే కార్యక్రమం: బక్కాసుర వధ నాడు., భీముని వేష దారి, అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలొ వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి ''భారతం మిట్ట'' కు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పధార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పధార్థాలను అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్సిత మౌతుంది. ఈ [[మహాభారత నాటకాలు]] ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.
==ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట==
ఇది పగటి పూట జరిగే మరో ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి బాగ అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాం ప్రమాణ ముద్రలో [['వరానికి'
==దుర్యోధనుని వద==
Line 38 ⟶ 36:
==యితర లింకులు==
{{wiktionary|వీధినాటకము}}
[[వర్గం:నాటకాలు]]
[[వర్గం:వినోద కార్యక్రమాలు]]
|