మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: వ్యవస్త → వ్యవస్థ using AWB
పంక్తి 1:
[[File:The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg|thumb|300px|Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya]]
{{హిందూ మతము}}
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అందురు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతి ని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు. ఈ శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.
 
హిందూ పవిత్ర పుస్తకాల్లో మనుధర్మ శాస్త్రం ముఖ్యమైనది. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అందురు. మనుధర్మ శాస్త్రమును వేదాలకు ఖిలిబుక్కు (Supplementary)అని భారతీయులు నమ్ముదురు. ఇందులో 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ , సామాజిక మరియు మతపరమైన నియమాలు ఇందులో ఉంటాయి.
 
మొదటి అధ్యాయంలో సృష్టి ఆవిర్భావం, పుస్తక జననం, పుస్తకం ఎందుకు చదవాలి అన్న విషయాలుంటాయి. 2 నుండి 6 వ అధ్యాయాల్లో ఉన్నత కులాల వారి కట్టుబాట్లు, యజ్ఞోపవేతము ధరించడం ద్వారా లేదా పాప పరిహార యాగం ద్వారా బ్రాహ్మణ కులాన్ని ఆచరించడం గురించి, బ్రాహ్మణ గురువు వద్ద విద్య నేర్చుకొనే విద్యార్దుల ప్రవర్తన గురించి, గృహస్తుడి ప్రధాన బాధ్యతలైన - భార్య ఎంపిక, వివాహం, యజ్ఞ యాగాదుల సంరక్షణ, ఆతిధ్యము, దేవుళ్ళకు అర్పించే బలులు, విందులు, వృధాప్యంలో బాధ్యతలు మొదలైనవి చెప్పబడినవి. 7వ అధ్యాయంలో పాలించే రాజుల బాధ్యతలు,
పంక్తి 38:
 
==ఇతర విషయములు==
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చినది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్తవ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు.
 
==లంకెలు==
http://sanskritdocuments.org/all_pdf/manusmriti.pdf
 
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు