క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 2:
ప్రపంచంలో మానవాళి అత్యధికంగా వెంబడించే మతం క్రైస్తవ మతం అని చెప్పడంలో సందేహం లేదు. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంధము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంధము.
==చరిత్ర==
ఆర్యుల వేద కాలంలో యూదుల మతము (Judaism) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews)కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు హిందువులు తమ దేవతలని సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు , కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు (భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్ధము) అను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను" అని క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18 - 25 చెబుతున్నది.
|