ఉత్తమకళాసృష్టి వలన మనలో ఒక భావం ఉదయించి, తనూలంగాదానిమూలంగా కళాసృష్టి యందు మనకొక పూర్ణ నిమగ్నత కలిగి, ఆ భావం స్థాయీపరమై పెచ్చు పెరిగి, తదనుసారంగా మనం ఒక అనిర్వచనీయమైన అపరిమిత ఆనందం అనుభవిస్తాము. అప్పుడు మనకు రసానుభూతి కలిగిందంటారు. ఆనందస్వరూపమైన ఈ అపరిమిత ఆనందాన్ని '''రసం''' అన్నారు. అందుచేత రసప్రకృతి మనలో కళాసృష్టి వలన ఉదయించే ప్రధానభావాన్ని అనుసరించి ఉంటుంది. భావాలు అనేక రకాలుగా ఉండటం చేత, రసాలు కూడా వేర్వేరుగా ఉండకతప్పదు. కాని ప్రతీభావం మనలో స్థితినందుకొని స్థాయీప్రంగా పెరిగి రసంకాగల శక్తి కలదై యుండదు. ఈశక్తి కలిగిన భావాలు కొన్ని మాత్రమే. మాంవహృదయ నైజం బాగా శోధించిన మన పూర్వపు వక్తలు, ఈ భావాలు ఎనిమిదని చెపారు. కాని కొంతకాలమైన తరువాత క్రీ.శ. 5 వ లేక 6అ శతాబ్దములో మరొక రసాన్ని నిర్వచించి '''శాంత''' రసాన్ని చేర్చి, నవ రసాలుగా నిర్ణయించారు.