నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB |
||
పంక్తి 15:
నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి [[నిజాం]] వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెది.
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు ను తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు
1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న [[నిజాము నవాబు]] [[వల్లబాయి పఠేల్]] ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్ మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి వారి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. కాని వివిధ సంస్థల ఆందోళనతో 1949 ఆగస్టు 10న జనరల్ చౌదరి వీరిని విడుదల చేశారు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-29707 ముగిసిన నియంత నిజాం పాలన - ఆంధ్రప్రభ 17 Sep 2009]</ref> నారాయణరావు పవార్ 85 యేళ్ళ వయసులో హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో డిసెంబర్ 8, 2010న కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/4-453
|