రైలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (7) using AWB
పంక్తి 111:
 
==భూగర్భ రైలు మార్గాలు==
రాజధాని నగరాల్లో భూగర్భ రైళ్ళు, నగర ప్రాంతానికి పరిమిత్మైన ప్రత్యేక రైళ్ళు నగరవాసుల పాలిట వరాలుగా విలసిల్లాయి. 1863 లో మొదటి భూగర్భ ఆవిరి రైలు, 1870 లో మొదటి భూగర్భ రైలు మార్గం లండాన్ లో ప్రవేశపెట్టబడ్డాయి. లండన్ నేల బంకమన్ను ఉండటం వల్ల భూగర్భ రైలు మార్గాన్ని వంద అడుగుల లోతులో నిర్మించారు కానీ బెర్లిన్, పారిస్ నగరాల్లో నేల గట్టిగా ఉంటుంది. కాబట్టి సొరంగాలను కేవలం కొన్ని అడుగుల లోతులో నిర్మిస్తే సరిపోతేది. విద్యుచ్చక్తి సరఫరా కోసం పవర్ స్టేషన్స్టేషను ల నిర్మాణం చురుకుగా మొదలయ్యాక మొదటి ఎలక్ట్రిక్ భూగర్భ మార్గాన్ని 1900 లో ప్రవేశపెట్టారు. 1907 నుండి 1968 వరకు పెద్ద మార్పులేమీ జరగలేదు.
 
న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైలు మార్గం 1904 లో నుంచి ప్రారంభించబడినది. ఈ మార్గంలో స్టేషన్లస్టేషనుల సంఖ్హ్య 475 ఉండేది. 1950 నుంచి ఇక్కడ ఎప్పటికప్పుడు ఆధునీకరణ జరుగుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధానికి సుమారు పదేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన పారిస్ లో మాత్రం భూగర్భ రైలు మార్గం యధాతథంగా ఉండిపోయింది. ప్రశాంత పురాతనత్వం పట్ల పారిస్ ప్రజలకుండే మోజు దీనికి కారనం కావచ్చు.ప్రపంచంలోని మిగతా రాజధాని నగరాల్లో కూడా ఈ సౌకర్యం ప్రవేశ పెట్టబడింది. అన్నిటి కంటే మాస్కో లో ఉండే వ్యవస్థ చాలా సమర్థవంతమైంది. పశ్చిమ యూరప్ దేశాలకు పోలిస్తే అక్కడి స్టేషన్స్టేషను భవన నిర్మాణశైలి పాతకాలం పద్ధతిగా కనబడవచ్చు గానీ అక్కడ భూగర్భ రైళ్ళు చాలా వేగంగా నడుస్తాయి. సాంకేతికపరంగా అవి చాలా ఆధునికంగా కూడా ఉంటాయి.
 
==రైలు మార్గాల విద్యుదీకరణ==
పంక్తి 122:
ఎలక్ట్రిక్ రైళ్ళలో పొగ, మసి లెకపోవటం ప్రయాణీకులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంజన్ పొగ లోని ఆమ్ల సంబంధమైన అంశాల వల్ల ఇళ్ళు, కట్టడాలు దెబ్బతినే ప్రశక్తి లేదు. పొగగొట్టం నుంచి వచ్చే మిణుగులుల వల్ల అపాయం లేదు. పొరంగాల్లో వెళ్ళేటప్పుడు వాతావరణం కలుషితం కాదు. మట్ట ప్రాంతాల్లో ప్రయాణం ఆవిరి రైలు కంటే వేగంగా ఉంటుంది. ఈ అన్ని కారణాల మూలంగానే రైలు మార్గాల విద్యుదీకరణ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా జరుగుతోంది.
==విద్యుదీకరణ - రకాలు==
విద్యుదీకరణ రెండు రకాలుగా జరుగుతుంది. ఒక రకంలో 50 నుంచి 3000 వోల్టుల వరకు ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని వాడుతారు. మరోరకం లో 25,000 వోల్టుల ఏకాంతర విద్యుత్తు ని ఉపయోగిస్తారు. డి.సి. ని వాహక తీగల్లో ఎక్కువ దూరం తీసుకెళ్ళితే ప్రసార నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పవర్ స్టేషన్స్టేషను లు ఎ..సి నే సరఫరా చేస్తాయి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళు పనిచేయటానికి కావలసింది డి.సి యే, ఎ.సి.ని డి.సి. గా మార్చటానికి మొదట్లో మెర్క్యురీ ఆర్క్ రెక్టిఫైయర్, కాంటాక్ట్ రెక్టిఫైయర్ లను వాడేవారు. ఇటీవల జెర్మేనియం రెక్టిఫైయర్. యూస్టన్-లివర్ పూల్ మార్గంలో మాత్రం 25,000 వోల్ట్ ఎ.సి ని వాడుతున్నారు. దీన్ని 1960 లో ప్రారంభించారు. 3,300 హె.సి ఇంజన్ తొ ఇది గంటకు 90 మైళ్ళ వేగాన్ని సాధించగలిగింది. ఆవిరి ఇంజన్ వెళ్ళె గరిష్ట వేగం గంటకు 130 మైళ్ళయితే, ఫ్రాన్స్ లో ఎలక్ట్రిక్ రైలు 1955 లోనే 205 మైళ్ళ వేగాన్ని సాధించింది.
 
==ఆవిరి రైళ్ళ వినియోగం తగ్గుదల==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు