నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
శ్రీ సౌమ్యనాథున్ని చొక్కానాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగుశాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.
 
ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.
 
బ్రహ్మోత్సవాలు:- ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, 2014 లో జులై-5 నుండి 14 వరకు నిర్వహించెదరు. ఏడవ తేదీన ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, రాత్రికి హంసవాహనం, 8వ తేదీన గ్రామోత్సవం, రాత్రికి సింహవాహనం, 9వ తేదీన పల్లకీ సేవ, రాత్రికి హనుమంతసేవ, 10వ తేదీన ఉదయం శేషవాహనం, రాత్రికి గరుడసేవ, 11వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ సౌమ్యనాధస్వామివారి కల్యాణ మహోత్సవం, 13వ తేదీ ఉదయం రథోత్సవంం రాత్రికి అశ్వవాహన సేవ, 14వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు