మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 3:
|image=Bangalore Shiva.jpg
|caption=లార్డ్ శివ
|observedby= సాధారణంగా [[హిందువు|హిందువుల]] యొక్క , [[శైవం | శైవులు]] ముఖ్యంగా, మండి శివరాత్రి ఉత్సవం
|observances=ఉపవాసం, [[లింగం]] యొక్క [[పూజ (హిందువుల)| ఆరాధన]]
|longtype=హిందు
|date = ఫిబ్రవరి / మార్చి
పంక్తి 20:
 
==ప్రాశస్త్యం==
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో అమావాస్య ముందు మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి జరుపుకొంటారు. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉన్నది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ మాసము]] యొక్క కృష్ణ పక్ష చతుర్దశి ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్ర మైనదిగా ఉంది. <ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
పంక్తి 32:
==విదేశాలు మహాశివరాత్రి==
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు.
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు. <ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
 
పంక్తి 74:
 
== మహా శివరాత్రి వృత్తాంతం ==
మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.<br />
 
గంగా యమునా సంగమ స్థానమైన [[ప్రయాగ]]లో (నేటి [[అలహాబాదు]]) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో [[రోమర్షణమహర్షి]] అని పేరు గాంచిన [[సూతమహర్షి]] అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి [[సరస్వతీ]] నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన [[వ్యాసుడు]] [[బ్రహ్మ]] కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు. <br />
 
అప్పుడు [[మందర]] పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, [[నందికేశ్వరుడు|నందికేశ్వరుని]]కి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.<br />
 
== బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ==
[[దస్త్రం:NatarajaElectricLights.jpg|thumb|right|200px|విద్యుద్దీపపు కాంతుల్లో నటరాజ స్వరూపుడైన పరమశివుడు]]
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు [[బ్రహ్మ]], [[విష్ణువు]]లు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే [[మహాదేవుడు]] లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.<br />
 
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ [[హంస]] వాహనం పైన, విష్ణువు [[గరుడ వాహనం]] పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు [[మాహేశ్వరాస్త్రం]], బ్రహ్మ [[పాశుపతాస్త్రం]] ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. [[ప్రమథ గణాలు|ప్రమథగణాల]] కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.
పంక్తి 123:
== శివరాత్రి పూజా విధానాలు ==
[[దస్త్రం:Divine Shringaar.jpg|thumb|right|[[శ్రీనగర్]] లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం.]]
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి [[శివరాత్రి]] పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
 
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా [[అగ్నిలింగరూపము]] గా ఆవిర్భవించిన ప్రదేశము [[అరుణాచలము]]గా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
పంక్తి 135:
 
=== పంచాక్షరి మంత్రం ===
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా [[అయిదు]] అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
 
=== మహామృత్యుంజయ మంత్రం ===
{{seemain|మహామృత్యుంజయ మంత్రం}}
[[మహామృత్యుంజయ మంత్రం]] [[ఋగ్వేదం]] (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం [[యజుర్వేదం]] (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.
 
ఓం త్ర్యంబకం యజామహే
పంక్తి 168:
{{శైవం}}
{{హిందూ మతము పంచాంగం పండుగలు}}
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు