[[1962]]లో జరిగిన [[అసెంబ్లీ]] ఎన్నికలలో ఈశ్వరీబాయి [[నిజామాబాద్]] జిల్లాలో కొత్తగా ఏర్పడి, షెడ్యూల్డు కులాల వారికి రిజర్వు చేయబడిన [[ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం|ఎల్లారెడ్డి నియోజకవర్గం]] నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర శాసనసభకు పోటీచేశారు.<ref name=yellareddy>[httphttps://webcachearchive.googleusercontent.comis/20140707181527/search?q=cache:Ih0EikHc_cYJ:www.andhrajyothy.com/node/85079&strip=1 ఎల్లారెడి తోలి ఎమ్మెల్యేలు మహిళామణులే - ఆంధ్రజ్యోతి 13-04-2014]</ref> కానీ ఆ ఎన్నికలలో [[టి.ఎస్.సదాలక్ష్మి]] చేతిలో ఓడిపోయింది. కానీ [[1967]]లో జరిగిన ఎన్నికలలో తిరిగి అదే స్థానం నుండి పోటీ చేసి దేవాదాయ శాఖమంత్రిగా పనిచేస్తున్న సదాలక్ష్మిపై విజయం సాధించారు. 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశలో ఆమె చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ఉద్యమం కోసం సెపరేట్ తెలంగాణ పోరాట సమితి (ఎస్టిపిఎస్) అను పార్టీ ని స్థాపించారు. 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అభ్యర్ధిగా పోటీ చేసి, సమీప కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి నంది ఎల్లయ్యపై గెలిచి రెండవ పర్యాయం శాసనసభలో అడుగుపెట్టింది.<ref name=yellareddy/> ఆనాటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకులలో [[తరిమెల నాగిరెడ్డి]], [[వావిలాల గోపాలకృష్ణయ్య]], [[జి. శివయ్య]] గార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. పది సంవత్సరాలపాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన పాత్ర వహించారు. 1978లో [[జుక్కల్ శాసనసభ నియోజకవర్గం|జుక్కల్ నియోజకవర్గం]] నుండి రిపబ్లికన్ పార్టీ (కాంబ్లే) అభ్యర్ధిగా శాసనసభకు పోటీచేసి [[సౌదాగర్ గంగారాం]] చేతిలో ఓడిపోయింది.<ref>[http://www.thehindu.com/2004/03/08/stories/2004030808230300.htm Poll ticket: several women aspirants in fray - The Hindu Mar 08, 2004]</ref>