చంద్రశేఖరరెడ్డి యొక్క పాథమికప్రాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త తెలంగాణ రాష్ట్రంలోని,నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు(బోదన్)లో మొదలైనది.బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్.ఓ.ఎల్, బి.ఓ.ఎల్ లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్.ఏ (భాషాశాస్త్రం)లో,1979లో ఎమ్.ఫిల్ (తెలుగు)లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి ,1984లో పి.హెచ్.డి.పొందాడు.