కె.వి.రంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''కొండా వెంకట రంగారెడ్డి'''([[1890]] - [[1970]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే [[రంగారెడ్డి జిల్లా]]కు ఆ పేరు వచ్చింది.<ref>http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm</ref> [[1959]] నుండి [[1962]] వరకు [[దామోదరం సంజీవయ్య]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 83</ref> రంగారెడ్డి, [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
 
రంగారెడ్డి ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]][[తెలంగాణ రాష్ట్ర‌‌]]రాష్ట్రం లోని మొయినాబాదు మండలం, [[పెద్దమంగళారం]] గ్రామంలో డిసెంబరు 12, 1890న జన్మించాడు. రంగారెడ్డి ఆంధ్రమహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఈయన నిజాం శాసనసభలో, హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోనూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]] ఈయన మేనల్లుడు. [[1970]] [[జూలై 24]]న రంగారెడ్డి మరణించాడు. ఈయన స్మృత్యర్ధం 1978, ఆగష్టు 15న హైదరాబాదు జిల్లాను విభజించి నూతనంగా ఏర్పడిన జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరుపెట్టారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.వి.రంగారెడ్డి" నుండి వెలికితీశారు