[[మహబూబ్ నగర్ జిల్లా]] లోని సంస్థానాలలో ఒకటైన [[అమరచింత సంస్థానంసంస్థానము|ఆత్మకూరు సంస్థానాన్ని]] తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగినది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని ''అధిక + అరి '' అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి ''శనిగ్రహం '' అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....