మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
==స్థలపురాణం==
ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశాడట.
శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, షిఖాంజనేయ స్వాములున్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నర్సింహ క్షేత్రాలు ఉన్నాయి.
 
==ఆలయ ప్రత్యేకతలు==
[[నవ నరసింహ క్షేత్రాలు]]లో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెపుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానే్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
 
ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తిస్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కల్గినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది.
 
చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మిదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా వున్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఆ దివ్యాలయాల సందర్శనం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయస్వామి మందిరం ఉంది. ఇది అతి పురాతనమైనది. స్వామివారి మూర్తి ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలంనాటిదిగా చెబుతారు.
 
==బ్రహ్మోత్సవాలు==