కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 22:
==కుంభకర్ణుడి యుద్ధం==
కోటగోడను ఒక్క అంగలో దాటి కుంభకర్ణుడు యుద్ధానికి రాగానే వానరసేన భయంతో పారిపోసాగింది. ఆ వచ్చేది ఒక యంత్రమనీ, రాక్షసుడు కాదనీ వానరసేనకు నచ్చజెప్పి అంగదుడు వారికి ధైర్యం చెప్పారు. వానరవీరులంతా ఒక్కుమ్మడిగా పైబడినా కుంభకర్ణుడికి ఈగలు ముసిరినట్లే అనిపించింది. వారు విసిరిన బండలు వాడి దేహానికి తగిలి పొడి ఐపోయాయి. [[హనుమంతుడు]] వాడి గుండెలమీద వేసిన పర్వత శిఖరంవలన మాత్రం కాస్త చలించి రక్తం కక్కుకున్నాడు. కుంభకర్ణుడు శూలంతో పొడవగా హనుమంతుడు కూడా గర్జించాడు.
అంగదుడు, నీలుడు, ఋషభుడు, శరభుడు వంటి వీరులు కుంభకర్ణుడి చరుపులకు సృహ తప్పారు. హనుమంతుడు కుంభకర్ణుడి శూలాన్ని విరిచేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని చేత పట్టుకొని లంకవైపు బయలుదేరాడు. దారిలో సృహ వచ్చిన సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు గిల్లి, ముక్కు కొరికి నేర్పుగా తప్పించుకొని ఎగిరి మళ్ళీ వానరసేన వైపు వచ్చిపడ్డాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఎడా పెడా వానర సైన్యాన్ని తినిపారవేయసాగాడు.
లక్ష్మణుడు తీవ్రమైన ఏడు బాణాలతో కుంభకర్ణుని బాధించాడు. రాముడు వేసిన రౌద్రాస్త్రం వల్ల కుంభకర్ణుని నోట అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నిరాయుధుడైన కుంభకర్ణుడు చేతులతోనూ, కాళ్ళతోనూ అందరినీ మర్దించసాగాడు. వాడిని నిలవరించడానికి ఎందరో వానరులు వాడిమీదకు ఎక్కినా వాడు వాళ్ళను విదిలించేశాడు. రాముడు వేసిన వాడి బాణాలు కూడా వాడిని ఆపలేకపోయాయి.
==కుంభకర్ణుడి మరణం==
ఇక లాభం లేదని రాముడు వాయువ్యాస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతినీ,ఐంద్రాస్త్రంతో మరొక చేతినీ తెగగొట్టాడు. మరో రెండు మహిమాన్విత బాణాలతో కాళ్ళను నరికేశాడు. ఐనా రాహువులాగా కుంభకర్ణుడు ముందుకే వస్తున్నాడు. అపుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడిని సంహరించాడు. వాడి దేహం క్రింద పడి అనేక వానరులూ, రాక్షసులూ నలిగి మరణించారు.
దేవతలూ, గంధర్వులూ, మహర్షులూ రామచంద్రుని కీర్తించారు. వానర సేనా నాయకులు రాముని పూజించారు.
రావణుడు దుఃఖించాడు. కుంభకర్ణుని ఇద్దరు కొడుకులు- కుంభుడు, నికుంభుడు అనే మహావీరులు - తరువాత యుద్ధంలో మరణించారు.
==వనరులు==
* వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనము - బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకటరామశాస్త్రి (రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి వాఱి ప్రచురణ)
{{రామాయణం}}
|