గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
[[1911|1911లో]] [[రామమోహన గ్రంథాలయం|రామమోహన గ్రంథాలయాన్ని]] [[అయ్యంకి వెంకటరమణయ్య]] స్థాపించారు. ఆయన [[1914|1914లో]] [[విజయవాడ]] ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో [[గ్రంథాలయ మహాసభ|గ్రంథాలయ మహాసభలు]] నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరఫున ''ఇండియన్ లైబ్రరీ జర్నల్''ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. [[పశ్చిమగోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]] జిల్లాల గ్రంథాలయ సంఘాల కార్యదర్శులు [[1934]]-[[1948]] మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంచించారు. మూసివేయబడిన గ్రంథాలయాలు ఎన్నో పునరుద్ధరించారు. [[1920]], [[1934|1934ల్లో]] గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉద్యమనిర్వహణలో భాగంగా గ్రంథాలయ సంఘాల ప్రతినిధులు ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించారు.
== గ్రంథాలయ మహాసభలు ==
{{main|గ్రంథాలయ మహాసభలు}}
[[1914|1914లో]] ప్రారంభమైన గ్రంథాలయ మహాసభలు రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయోద్యమ రూపకల్పనకూ చేయూతనిచ్చాయి. మొదటి గ్రంథాలయ మహాసభలు [[1914]] [[ఏప్రిల్ 10|ఏప్రిల్ 10న]] [[విజయవాడ|విజయవాడలో]] రామమోహన ధర్మపుస్తకభాండాగారం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మహాసభలకు ప్రముఖ కవి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] అధ్యక్షత వహించారు. అప్పటికే రాష్ట్రంలోని [[గంజాం]], [[విశాఖపట్టణం]], గోదావరి జిల్లా, [[కృష్ణా జిల్లా]], [[నెల్లూరు జిల్లా|నెల్లూరు]] ప్రాంతం, [[కడప జిల్లా|కడప]], [[కర్నూలు జిల్లా|కర్నూలు]] మొదలుకొని బళ్ళారి వరకూ ఏర్పాటైన 60 గ్రంథాలయాల నుంచి 200 మంది ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. మొదటి గ్రంథాలయ మహాసభల సందర్భంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటుచేశారు.
 
సూర్యాపేటయందు మహావైభవముతో జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామననాయకుగారు అధ్యక్షత వహించిరి. వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజామురాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడినది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.
 
బరోడా గ్రంధాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంధాలయములకు విధ్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంధాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంధాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంధము
 
బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండు నుండియు సహాయద్రవ్య మిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయములో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్యేకించుటకును, ఈ యుద్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్క్యులరులను వెంటనే రద్దు చేయించ వలసినదనియు - హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంథములనుకూడ ఉంచవలయుననియు - దీనిని సెలవులలో మూయకుండ ఏర్పాటుల చేయవలయుననియు - గ్రంథాలయ సంబంధములగు సభలను ముందు ప్రభుత్వాధికారులు ఆపకుండ ఏర్పాటుల చేయవలసిన దనియు ప్రభుత్వమువారు ప్రార్థింప బడిరి.
 
== ఆంధ్ర గ్రంథాలయ సంఘం ==
1914లో ఆంధ్రదేశంలోని గ్రంథాలయాల ఏర్పాటును, నిర్వహణను ప్రోత్సహించేందుకు ఆంధ్రదేశ గ్రంథభాండాగార సంఘం ఏర్పాటుచేశారు. సంఘానికి తొలి అధ్యక్షునిగా మోచర్ల రామచంద్రరావు పంతులు వ్యవహరించారు. కార్యదర్శులుగా అయ్యంకి వెంకటరమణయ్య,
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు