బందగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==యివి కూడా చూడండి==
కాస్త విపులంగా ...
షేక్‌బందాగీ సాహెబ్‌ పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీ. ఆయన కుమారుడు ఫకీర్‌అహమ్మద్‌. ఫకీర్‌అహమ్మద్‌ విసూనూర్‌దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి వద్గా ఉద్యోగి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్బాస్‌అలీ విసూనూర్‌ దేశ్‌ముఖ్‌కు నమ్మినబంటుగా మారాడు. 1941లో బందాగీకి అతని పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీకి భూసంబంధామైన వివాదాం తలెత్తింది. జ్యేష్టభాగంగా తనకు లభించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న అబ్బాస్‌అలీకి తన దాయాదాులు అనుభవిస్తున్న మిగతా భూమిని కూడ కాజేయాలన్న దుర్బుద్థి పుట్టింది. ఆ దుర్బుద్ధికి దేశ్‌ముఖ్‌రామచంద్రారెడ్డి అండదాండలు అందాయి. ఆ రోజుల్లో ' నైజాం క్రిందా ఉన్న దేశ్‌ముఖ్‌లలో నరరూప రాక్షసుడుగా, కలియుగ రావణాసురుడుగా పేరొందిన విసూనూర్‌ దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి, 40 వేల ఎకరాల భూమికి, 60 గ్రామాలకు సర్వాధికారి. ఈ 60 గ్రామాలపై తను చెలాయించని అధికారము అంటూ లేదు. నిర్వహించని దౌర్జన్యం అంటూ లేదాు. నిర్బంధా వెట్టిచాకిరి చెప్పతరం కాదు. గ్రామాలలో గల ప్రతి కులము వారు కులాల వారిగా వెట్టిచాకిరి చెయ్యాలి. ప్రతి పండుగకు, పబ్బానికి మామూళ్ళు ఇచ్చుకోవాలి. వ్యవసాయ పనులకుగాను అన్ని రకాల వెట్టిచాకిరి సేవలు చెయ్యాలి. చివరకు బ్రహ్మణులను కూడ వదాలలేదాు. వీరు విస్తర్లు కుట్టి దొరల ఇండ్లకు సరఫరా చెయ్యాలి. భూస్వాముల, దొరల ఇండ్లలో పనులు చేయుటకు బానిసలుగా బాలికలను పంపే ఆచారము ఈ ఫ్యూడల్‌ దోపిడికెల్లా అతి దారుణమైంది. గ్రామాలలో ఎవరైనా ఎక్కడైనా మేకనో, గొర్రెనో కోస్తే దానిలో కొంత ఆ ఊరి దొరకు పంపాలి. 1940లో విస్నూర్ గ్రామములో దేశ్‌ముఖ్‌బంగ్లా నిర్మాణానికి వెట్టి కొరకు మనుషులనే కాక బండి నడిపే కోడెలను (పశువులను) నిర్బంధగా తోలుకెల్లినారు. చందాలు వసూళ్ళు చేయించాడు. ఆనాటి కాలములో పంటచేను, పాడిఆవు, పడుచు బిడ్డ, నడిచేగొడ్డు, నాలుగు కాసులు ఇవన్ని దేశ్‌ముఖ్‌దౌర్జన్యానికి బలి అయ్యేవి. గ్రామాలలో గొడవలు ఏర్పడితే వాటిని దేశ్‌ముఖ్‌గడిలో పరిష్కరించడం అనవాయితి. దేశ్‌ముఖ్‌ఆధీనములో గల గ్రామాలలో సివిల్‌, క్రిమినల్‌కేసులతో సహా స్వంత పోలీసు బలగాలతో సర్వాధికారాలు చెలాయించాడు. అనాడు అతనిని ఎదిరించడం అంటే మృత్యువును ఆహ్వనించినట్టే. తన 60 గ్రామాలలోని ధానిక, భూస్వామ్య మక్తిదారులపై విసూనూర్‌ దేశ్‌ముఖ్‌పెత్తనం చెలాయించాడు. తన ఆధిపత్యాన్ని అంగీకరించని వారి ఆస్తి-పాస్తులిన్ని సర్వనాసనం చేయించేది. ఆతడు సాగించిన దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే, అతని ఏజెంట్లు, గూండాలు సాగించుకున్న పాశవిక నికృష్టాలు, చేసిన హత్యలు మరొక ఎత్తు' (బందాగీ కోర్టుబాట- తెలంగాణా పోరుబాట (1928-40), పేజి.216) అటువంటి భయానక దేశ్‌ముఖ్‌ప్రాపకం సంపాదించిన అబ్బాస్‌అలీకి తమ్ముళ్ళ భూమిని కాజేయడం ఏమాత్రం కష్టం అన్పించలేదు.బందాగీ కోర్టులో ఈ కేసు వేసి గెలుపొందడం ఆరోజుల్లో మాములు విషయంకాదు. ఒక పథాకం ప్రకారంగా బందాగీ జనగాం కోర్టునుండి బయలుదేరి కామరెడ్డిగూడెం బస్టాండు వద్ద బస్సుదిగి ఇంటికివెళ్లు దారిలో పొంచి ఉన్నగూండాలు విసూనూర్‌ దేశ్‌ముఖ్‌ గూండాలు ఒంటరివాన్నీబందాగీని పాశవికంగ హత్య చేసారు.--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]] ([[వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్|చర్చ]]) 16:16, 27 ఏప్రిల్ 2015 (UTC)
* [[తెలంగాణ విమోచనోద్యమం]]
 
"https://te.wikipedia.org/wiki/బందగి" నుండి వెలికితీశారు