శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||
</poem>
=== బంగారు స్థంభాలు ===
 
గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొందురు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.
=== మొదటి ప్రాకారం ===
 
మొదటి ప్రాకారమునగల ముఖ్య విశేషములు:- ద్వారపాలకులు, యాగశాల; విరజబావి; సేనమొదలియార్ సన్నిధి; పగల్‌పత్తు మండపం; చిలకల మండపం; కణ్ణన్, సన్నిధి. ఇక్కడ గల చిలుకల మండపము నుండియే విమానముపై గల పరవాసు దేవులను సేవింప వలయును.
=== రెండవ-ప్రాకారము ===
 
రెండవ-ప్రాకారము:- ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం గలదు. ఈ మండపములో
 
హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు కలవు. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం జరుగు మండపం. పరమపద వాశల్; తిరుమడప్పళ్లి; ఊంజల్ మండపం; ధ్వజారోహణ మండపం గలవు. ఇచట స్తంభముపై గల వినీత ఆంజనేయస్వామి వరప్రసాది.
=== మూడవ ప్రాకారం ===
 
మూడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ తిరువీథిలో గరుడన్ సన్నిధి గలదు. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు గలవు. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే కలదు. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచు మండపము గలదు. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి గలదు. ఉగ్రాణము; మేల్ పట్టాభిరామన్ సన్నిధి; ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి గలవు.
=== నాల్గవ ప్రాకారము ====
 
నాల్గవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి గలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ వేంచేసి యున్నారు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాదమునుల సన్నిధి గలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.
 
ఈ ప్రాకారమలో సేవింప దగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ)అవతరించిన విధము చిత్రించబడినది.
=== విజయ స్థంభం ===
 
విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే కలవు. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే యున్నది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షులు వేంచేసియున్నారు. మీనమాస పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము. అది ఈ ప్రాకారములోనే కలదు. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు
 
పంక్తి 160:
 
ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో కలదు. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.
=== శేషరాయన్-మండపము ===
 
ఇచట గల శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి కలవు. దాని ప్రక్కన పిళ్ల లోకాచార్యుల వారి సన్నిధి, వారి సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారది సన్నిధి కలవు.
=== పరివారదేవతలు ===
 
ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామానుజులు) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (తానేయైన తిరుమేని) ఇది పూర్వము వసంత మండపము. ఇచట వేంచేసి యున్న ఉడయ వరులు సేవించువారి హృదయమున వేంచేసి యుందురని మణవాళ మామునులు అభివర్ణించి యున్నారు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి వేంచేసి యున్నారు. స్వామి తిరువారాదన యగు తేవ ప్పెరుమాళ్ (వరదరాజస్వామి) సన్నిధి ప్రక్కన వేంచేసి యున్నారు. ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతమున స్వామి సన్నిధిలో సేవ శాత్తుముఱై జరుగును.
 
ఇంకను ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.
=== ఐదవ ప్రాకారము ===
 
ఐదవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చిమార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు.
 
ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి కలవు.
=== ఆరవ ప్రాకారము ===
 
ఆరవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్ర్హహ్మోత్సవమున నంబెరుమాళ్లు ఈ వీధులలో వేంచేయుటచే ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వారాదులు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో వేంచేయుదురు.
 
ఉత్తర మాడ వీధిలో వేధాంత దేశికర్ సన్నిధి, దీనికి ప్రక్క జగన్నాధన్
పంక్తి 178:
 
దక్షిణ ప్రాకార వీధి మధ్యలో పాతాళకృష్ణన్ సన్నిధి కలదు. ఇది ఐదు అడుగుల లోతులోనున్నది.
=== ఏడవ ప్రాకారము ===
 
ఏడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చును. కుంభమాస(మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి కలదు. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి కలదు. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.
=== ఉత్సవాలు ===
 
ఉత్సవ విశేషములు: మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడినది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చినది. కుంభమాసమున "శుద్దఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడినది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడినది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.
 
ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.
=== ఆళ్వార్ల అనుభవములు ===
 
ఈ క్షేత్ర స్వామి విషయమై ఆళ్వార్ల అనుభవములు: నమ్మాళ్వర్ల తిరువాయి మొళి సప్తమ శతకము రెండవ దశకములో (7-2) భగవద్విశ్లేషమును సహింపలేక శ్రీరంగనాథుల శ్రీపాదములలో ప్రపత్తి చేసి అదియు పలింపక పోవుటచే దు:ఖనిమగ్నులై నాయికావస్థను బొంది యుండగా అప్పుడామె
 
తల్లిగారు తమ కుమార్తె విషయమై "నీవేమి తలచియున్నావనీ" శ్రీ రంగనాథుని ప్రశ్నించుచున్నారు. "ఇవళ్ తిరత్తు ఎన్ శిన్దిత్తాయ్" ఈమె విషయమై ఏమి తలంచితివి?
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు