మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
== విద్య ==
== పరిపాలనా ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
== ప్రార్ధనా ప్రదేశాలు ==
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అదికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [5]
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 383.1279 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఈ ఆలయానికి 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉన్నది. [3]
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు