=== దేశ పర్యటన మరియు బౌద్ధ మత ప్రచారం ===
[[దస్త్రం:Dasavatara9.png|thumb|దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు]]
మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరివాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండిబెదిరింపులునుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.
బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ, సన్యాసులతోనూ, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ, ఒక్క వర్షా కాలం తప్ప, మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినేవస్సాన అని అంటారు.
బుద్ధునికి జ్ఞానోదయమయిన విషయం తెలుసుకుని, శుద్దోధనుడు, బుద్ధుని, కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగామారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి, జ్ఞానోదయమయిన 2 సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకనప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకుచేరుకున్నాక, రాజ భవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటిఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్దోధనుడు బుద్ధునితో, "మనదిమహామస్సాట రాజవంశము. మన వంశంలో ఏ ఒక్క వీరుడు కుడా భిక్షాటన చెయ్యలేదు" అని అన్నాడు. దానికి బుద్ధుడు, "భిక్షాటనమీ రాజవంశాచారము కాదు. అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు వేల కొద్దీ బుద్దులు భిక్షాటన చేశేవారు" అని చెప్పాడు.
తర్వాత శుద్దోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజ భవనానికి భోజనం కొరకు ఆహ్వానించ్చాడుఆహ్వానించాడు. భోజనం తర్వాత ధర్మముపైజరిగిన చర్చలో, శుద్ద్దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శొతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులుబౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరిసన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు 7సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి (వరుసకు బుద్ధుని సోదరుడు) మొదట బౌద్ధ భిక్షువుగా మారినా, తర్వాత బుద్ధునిశత్రువుగా మారి, బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు.
బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ద మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూఉపాలిపాటూ ఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన మరియు పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు.
బుద్ధుడు ఐదవ వస్సనలో వేశాలికివైశాలికి దగ్గరలో ఉన్న మహావానలోమహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్దోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్దోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్దోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంధాల ప్రకారం, బుద్ధుడుమొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా పజాపతిప్రజాపతి, బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి, కపిలవస్తుని విడిచి పెట్టి, రాజగహకు ప్రయాణమయ్యాడు. కాని మహాపజాపతిమహాప్రజాపతి నిరాశ చెందక, కొందరు శాక్య మరియు కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి, బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాతఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగాజతపర్చాడుప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.
తర్వాత కొంతకాలానికి, దేవదత్తుడు, బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో, దేవదత్తుడు, తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు మరియు బింబిసారునికుమారుడైనబింబిసారుని కుమారుడైన అజాతసత్రుఅజాతశత్రు కలసి, బుద్ధుని, బింబిసారుని హత్య చేసి, తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. దేవదత్తుడు మూడు సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపైనుండి ఒకపెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలనుమాత్రం తాకింది. మూడవ సారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడావిఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో, దేవదత్తుడు, బౌద్ద సంఘంలో స్త్రీలకు మాత్రమె కేటాయించిన వినయమనేనియమంపైవినయమనే నియమంపై కొత్తగా ఆంక్షలను విధించి, బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కాని బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతోదేవదత్తుడునిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి, బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలు పెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు, మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసినా, సారిపుత్త, మహా మొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించిచెప్పి, తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని, బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగాచేశాడు.
=== బుద్ధుని నిర్యాణం ===
|