ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

Arts_College.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==జాతీయోద్యమంలో పాత్ర==
స్వాతంత్ర్యోద్యమంలో ఈ కళాశాల ముఖ్యపాత్రను నిర్వహించింది<ref>{{cite journal|last1=ఎడిటర్|title=స్వాతంత్ర్యోద్యమంలో అనంత విద్యార్థుల పాత్ర|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=60}}</ref>. ఈ కళాశాల 1940-43 మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు పలువురు తమ భవిష్యత్తును లెక్కచేయకుండా జాతీయోద్యమంలో దూకారు. స్థానిక పీస్ మెమోరియల్ హాల్‌లో ఎ.పి.సి.సి సమావేశం జరిగినప్పుడు నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బరావు, పప్పూరు రామాచార్యులు, కడప కోటిరెడ్డి, టంగుటూరి ప్రకాశం మొదలైన హేమాహేమీలతో పాటు ఈ కళాశాల విద్యార్థులు జీవరత్నమ్మ, ఆదిశేషయ్య పాల్గొనడం ఆ రోజులలో సంచలనాన్ని సృష్టించింది. ఆ సమావేశంలో వ్యక్తిగత సత్యాగ్రహానికి బదులు సామూహిక సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించారు. 1940 జనవరి 28 న కళాశాల విద్యార్థులు రమేష్, టి.కె.ఆర్.శర్మ, [[ఆదిశేషయ్య]], జీవరత్నమ్మల[[జీవరత్నమ్మ]]ల ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ కాలంలోనే ఐదుకల్లు సదాశివన్, [[విద్వాన్ విశ్వం]], [[నీలం సంజీవరెడ్డిలసంజీవరెడ్డి]]ల ఆధ్వర్యంలో [[ఆకాశవాణి]] అనే సైక్లోస్టయిల్ పత్రిక రహస్యంగా వెలువడేది. ఆ పత్రిక విద్యార్థులకు ఎంతో చైత్యన్యాన్ని పెంచింది. రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు ఆదిశేషయ్యను[[ఆదిశేషయ్య]]ను కళాశాల నుండి బహిష్కరించారు. మహిళా విద్యార్థి జీవరత్నమ్మ ఆ రోజుల్లో విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించింది. పోలీసులు ఆమెను చితకబాదారు. ఆ తర్వాత ఆమె రహస్యంగా జాతీయోద్యమం లో పాల్గొనింది. ఆ రోజుల్లో ఆమెను కాలేజీ జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచేవారు. అప్పట్లో కాలేజీ లెక్చరర్లుగా ఉన్న [[దామెర్ల రామారావు]], [[ఉపమాక సూర్యనారాయణ]] రహస్యంగా విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు. ఈ విధంగా ఈ కళాశాల జాతీయోద్యమానికి సాక్షీభూతంగా నిలిచింది.
 
==తొలి విద్యార్థిని==
1920 ప్రాంతాలలో ఆడపిల్లలు కాలేజీ చదువు చదవడం చాలా అరుదైన విషయం. అనంతపురం మునిసిపల్ హైస్కూలులో టీచర్‌గా పనిచేసే [[కాశినేని నాగలింగప్ప]] మూడవ కుమార్తె '''[[నారాయణమ్మ]]''' ఐదవ తరగతి చదివాక ఆమె చదువు మాన్పించాలనుకొన్నారు. అయితే ఆమె పట్టుదలతో హైస్కూలుకు వెళ్లి ఎస్.ఎస్.ఎల్.సి పాసయింది. తరువాత కాలేజీలో చదువుకొనాలని ఆమె ఆకాంక్ష. తల్లి దండ్రులను, అన్నలను ఒప్పించి అప్పటి ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణమ్మ (పురుషుడు) ప్రోత్సాహంతో దత్తమండల కళాశాలలో చేరింది. ఆమె ఆ కళాశాల మొట్టమొదటి మహిళావిద్యార్థి<ref>{{cite journal|last1=జి.|first1=రామకృష్ణ|title=ప్రప్రథమ విద్యార్థిని నారాయణమ్మ|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=134}}</ref>. పాతూరు నుండి కొత్తూరులో ఉన్న కళాశాలకు ఒకతే నడుచుకుంటూ కాలేజీకి వచ్చేది. ఎలాగో కష్టపడి చదివి ఎఫ్.ఎ., బి.ఏ. పరీక్షలు పాసయింది. బి.ఎ. పాసయిన తర్వాత ఆమెను బళ్లారిలోని ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ వివాహబంధం ఎక్కువరోజులు నిలువలేదు. తరువాత పుట్టిల్లు చేరింది. ఆ తరువాత మద్రాసులోని టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ఎల్.టి.ట్రైనింగ్ పూర్తి చేసి టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆమె ఉద్యోగాన్ని సమర్థతతో నిర్వర్తించి పదోన్నతి పొంది విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ అయ్యింది. 20 సంవత్సరాలు రాయలసీమలో 10 సంవత్సరాలు సర్కారు జిల్లాలలో పనిచేసి రిటైర్ అయింది. 1998లో ఆమెను కళాశాల యాజమాన్యం సన్మానించింది.
 
==పూర్వ అధ్యాపకులు==