నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
'''నారాయణ రావు పవార్''' స్వాతంత్ర సమర యోధుడు. తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు.
నారాయణ రావు పవార్ [[1926]] వ సంవత్సరం, [[అక్టోబరు నెల
పంక్తి 9:
నారాయణ రావు, [[పండిత విశ్వనాథ్]] [[బొంబాయి]] వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గమధ్యంలో [[షోలా పూర్]] వద్ద [[లక్ష్మణ రావు బాపూజీ]] వీరికి కనబడ్డాడు. అప్పటికే లక్ష్మణ రావు ప్రముఖ క్రిమిల్ లాయరు. బాంబు లెందుకని లక్ష్మణ రావు అడగ్గా/..... రజాకార్లను చంపడానికని అబద్ధం చెప్పారు. దాంతో అతను [[నిజాము]]నె ఎందుకు చంప కూడదు? అని సూటిగా అన్నాడు. దాంతో వీరు అసలు సంగతి చెప్పేసారు. దాంతో లక్ష్మణ రావు వీరికి ఆరు వందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపాడు. బొంబాయిలో రెండు బాంబులు కొని తిరుగు ప్రయాణంలో లక్ష్మణ రావును షోలాపూర్లో కలిసి రెండు
హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు....... అనగా నారాయణ రావు పవార్ [[జగదీష్,]] [[గండయ్య]] తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........[[కింగ్ కోటి]]] రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాన్ని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోఠి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను వున్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు.
నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి [[నిజాం]] వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెది.
పంక్తి 17:
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు ను తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషను లో విచారణ సమయంలో మనారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా , నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో [[నైజామ్]] ప్రధాని [[మీర్ లాయక్ అలి]] అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక [[సర్దార్ పటేల్|సర్దార్ పటేలా?]] " అని ప్రశ్నించాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో [[గండయ్య]] వున్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆదారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదిని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పని చేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్భంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు [[ఉరి శిక్ష]] విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని[[ పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల]] కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు.<ref>ఆంధ్ర జ్యోతి ఆదివారం. 23 జనవరి; 2011</ref>
1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న [[నిజాము నవాబు]] [[వల్లబాయి పఠేల్]] ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్ మేజర్ జనరల్ [[జె.ఎన్.చౌదరి]] వారి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. కాని వివిధ సంస్థల ఆందోళనతో 1949 ఆగస్టు 10న జనరల్ చౌదరి వీరిని విడుదల చేశారు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-29707 ముగిసిన నియంత నిజాం పాలన - ఆంధ్రప్రభ 17 Sep 2009]</ref> నారాయణరావు పవార్ 85 యేళ్ళ వయసులో హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో డిసెంబర్ 8, 2010న కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/4-453
తెలంగాణ పోరాట యోధుడు ‘పవార్’ కన్నుమూత - ఆంధ్రభూమి December 9th, 2010]</ref>
|