భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటీష్ పరిపాలన. <ref>Oxford English Dictionary, 2nd edition, 1989: from [[సంస్కృతము|Skr.]] ''rāj'': to reign, rule; cognate with [[లాటిన్|L.]] ''rēx'', ''rēg-is'', OIr. ''rī'', ''rīg'' king (see RICH).</ref><ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec. </ref> ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.<ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec. </ref><ref>Oxford English Dictionary, 2nd edition, 1989. </ref> ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటీష్ ఇండియా అని కూడా వ్యవహరించేవారు.<ref>any schoolbook of the 1950s and before</ref> విక్టోరియా రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.<ref>The names "Empire of India" and "Federation of India" were also in use.</ref> భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉండగానే లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యురాలు, 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం, 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్యురాలూ.<ref name="mansergh-UN-SanFrancisco">{{citation|last = Mansergh|first = Nicholas|authorlink = Nicholas Mansergh|title = Constitutional relations between Britain and India|url = http://books.google.com/books?id=DJkOAQAAMAAJ|accessdate = 19 September 2013|publisher = His Majesty's Stationery Office|location = London|page = xxx}} Quote: India Executive Council: Sir Ramaswami Mudaliar, Sir Firoz Khan Noon and Sir V. </ref>
 
పరిపాలన విధానం జూన్ 28, 1858లో బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం [[యూనియన్ ఆఫ్ ఇండియా]](తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్(తదనంతర కాలంలో [[ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్]], దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌]] అయింది), [[డొమినియన్ ఆఫ్ సిలోన్]] (ప్రస్తుతం [[శ్రీలంక]]), [[సిక్కిం]] (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకూ వరకు
కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది, 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు, తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్రాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
 
== భౌగోళిక పరిధి ==
బ్రిటీష్ రాజ్ [[గోవా]], [[పాండిచ్చేరి]] వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలలో విస్తరించింది.<ref name="British India geography">{{cite web|title = The Geography of British India, Political & Physical (1882)|url = https://archive.org/details/geographybritis00smitgoog|website = Archive.org|publisher = UK Archives|accessdate = 2 August 2014}}</ref> దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటీష్ సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి. 1937 నుంచి బర్మా భారతదేశం నుంచి విడివడి 1948లో స్వాతంత్రం పొందేంతవరకూ నేరుగా బ్రిటీష్ రాణి పాలన కిందకు వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ట్రూషియల్ రాజ్యాలు సైద్ధాంతికంగా ప్రిన్స్ లీ స్టేట్స్, <div>1946వరకూ ఇవి బ్రిటీష్ ఇండియాలో భాగం, రూపాయిని వారి మారకద్రవ్యంగా(కరెన్సీ) వాడేవారు.<ref>{{cite book |author = Subodh Kapoor|title = The Indian encyclopaedia: biographical, historical, religious ..., Volume 6|publisher = Cosmo Publications|date = January 2002|page = 1599|url = http://books.google.co.in/books?id=q5ZM0nZXZEkC&pg=PA1599|isbn = 81-7755-257-0}}</ref></div>
 
ఈ ప్రాంతానికి చెందిన ఇతర దేశాల్లో, సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక) 1802లో అమైన్స్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ పాలన కిందికి వచ్చింది. 1793 నుంచి 1798 వరకూ సిలోన్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం.<ref name="codringtonch10">Codrington, 1926, Chapter X:Transition to British administration</ref> [[నేపాల్]] మరియు [[భూటాన్]] రాజ్యాలు, బ్రిటీష్ వారితో యుద్ధాలు చేసి, తదనంతరం వారితో ఒప్పందాలు సంతకం చేసి, బ్రిటీష్ వారి నుంచి స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.<ref>[http://www.britannica.com/eb/article-23632 "Nepal."] </ref><ref>[http://www.britannica.com/eb/article-25008 "Bhutan."] </ref> 1861లో జరిగిన [[ఆంగ్లో సిక్కిమీస్ ఒప్పందం ]] అనంతరం సిక్కిం రాజ్యానికి ప్రిన్స్ లీ స్టేట్ హోదా దక్కింది, అయితే సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం నిర్ధారించకుండా విడిపెట్టారు.<ref>"Sikkim." </ref> మాల్దీవులు 1887 నుంచి 1965 వరకూ బ్రిటీష్ సంరక్షిత ప్రాంతంగా ఉంటూవచ్చినా బ్రిటీష్ ఇండియాలో భాగం కాలేదు.
 
== ఆర్థిక పరిధి ==
[[దస్త్రం:British_Raj_coins_during_Edward_VII_and_George_V,_Indian_Museum,_Kolkata.jpg|thumb|భారతీయ మ్యూజియంలో ఎడ్వర్డ్ VII, జార్జి V కాలంనాటి బ్రిటీష్ ఇండియా నాణాలు]]
1780లో కన్సర్వేటివ్ వర్గానికి చెందిన బ్రిటీష్ రాజకీయవేత్త [[ఎడ్మండ్ బర్క్]] భారతదేశం స్థితిని గురించిన అంశాన్ని ముందుకుతెచ్చారు, [[వారన్ హేస్టింగ్స్]] మరియు ఇతర ఉన్నతాధికారులు భారతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారంటూ తీవ్రంగా ఈస్టిండియా కంపెనీపై దాడిచేశారు. భారతీయ చరిత్రకారుడు [[రాజత్ కాంత రాయ్]] (1998) ఈ దాడిని కొనసాగిస్తూ, 18వ శతాబ్దంలో బ్రిటీషర్లు తీసుకువచ్చిన కొత్త ఆర్థికవ్యవస్థ దోపిడీ అనీ, సంప్రదాయ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు మహా విపత్తు అనీ పేర్కొన్నారు.<ref name="British expansion in India">{{cite web|title = Britain in India, Ideology and Economics to 1900|url = http://www.fsmitha.com/h3/h50imp2.htm|website = Fsmitha|publisher = F. Smith|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీష్ పాలన ప్రారంభమయ్యాకా ధనం, ఆహారాల నిల్వలు తరిగిపోవడం, అత్యంత తీవ్రస్థాయిలో పన్నులు విధించడాన్ని విమర్శిస్తూ, తుదకు బెంగాల్‌లో మూడోవంతు జనం మరణించడానికి కారణమైన 1770లో వచ్చిన దారుణమైన బెంగాల్ కరువుకు దారితీశాయని రాయ్ ప్రతిపాదించారు.<ref>Rajat Kanta Ray, "Indian Society and the Establishment of British Supremacy, 1765–1818", in ''The Oxford History of the British Empire'': vol. 2, "The Eighteenth Century" ed. by P. </ref>
 
ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ [[పి.జె.మార్షల్]] మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.<ref name="Impact of British Rule">{{cite web|title = IMPACT OF BRITISH RULE ON INDIA: ECONOMIC, SOCIAL AND CULTURAL (1757–1857)|url = http://www.nios.ac.in/media/documents/SecSocSciCour/English/Lesson-05.pdf|website = Nios.ac.uk|publisher = NIOS|accessdate = 2 August 2014}}</ref> ఆయన బ్రిటీష్ స్వాధీనం భారతదేశపు గతంతో గొప్ప తేడా ఏమీ తెచ్చిపెట్టలేదని, ప్రాంతీయ మొఘల్ పాలకులకు పెద్దస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టి సాధారణంగా సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను మిగతా 18వ శతాబ్దమంతా కొనసాగిస్తూవచ్చిందన్నది ఆయన వాదన. బ్రిటీష్ వారు భారతీయ బాంకర్లతో భాగస్వామ్యం చేసుకుని, పన్నువసూలు చేసుకునే స్థానిక నిర్వాహకులతోనే ఆదాయం పెంచుకున్నారని, వారు పాత మొఘల్ కాలపు పన్ను రేటునే కొనసాగించారని మార్షల్ పేర్కొన్నారు.<div>చాలామంది చరిత్రకారులు ఈస్టిండియా కంపెనీ ఈస్టిండియా కంపెనీ పాలన భారతీయ రైతుల పంటలో మూడోవంతు తీసుకునే అత్యంత భారమైన పన్నుల విధానాన్ని కొనసాగించిందన్నది అంగీకరిస్తారు.[16] </div>
 
== బ్రిటీష్ ఇండియా మరియు ప్రిన్స్ లీ స్టేట్స్ ==